AP Crime: రూ.4 కోట్లు ముంచిన రాంగ్ కాల్..!
- ఓ రాంగ్ కాల్ విలువ అక్షరాల 4 కోట్ల రూపాయలు..
- తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో మహిళాకు ముచ్చేమటలు..
- రూ. 4 కోట్లు వదిలించింది.. ఏళ్ల పాటు నరకం చూపించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కొన్ని రాంగ్ కాల్స్.. కొందరికి కొత్త పరిచయాలను అందిస్తే.. మరికొందరి జీవితాల్లో ప్రేమ చిగురించేలా చేయడం.. ఇంకా కొందరి జీవితాలను సర్వనాశనం చేసిన సందర్భాల్లో ఎన్నో చూశాం.. తాజాగా, ఓ రాంగ్ కాల్ విలువ అక్షరాల 4 కోట్ల రూపాయల వరకు వెళ్లింది.. ముక్కు మొహం తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆ మహిళాకు ముచ్చేమటలు పట్టించింది.. సుమారు రూ. 4 కోట్లు వదిలించింది.. ఏళ్ల పాటు నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది..
Read Also: UP: ‘‘ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్లపై నమాజ్ ఆపడంతో నిరసన..
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 8 ఏళ్ల క్రితం ఓ రాంగ్ కాల్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ కుమార్ అనే వ్యక్తి.. ఆ పరిచయం కాస్తా వారి మధ్య సన్నిహిత్యాన్ని పెంచింది.. కన్నింగ్ ఐడియాలతో ఉన్న అక్షయ్ కుమార్.. ఆమెతో పర్సనల్గా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేశాడు.. ఇక, కొంత సమయం తర్వాత అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. బాధితురాలితో పర్సనల్గా తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించసాగాడు.. దఫా దఫాలుగా డబ్బులు వసూలు చేశాడు.. ఇలా నాలుగు కోట్ల రూపాయల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసి జల్సాలు చేయసాగాడు.. అంతే కాదు, తన కోరిక తీర్చాలంటూ పదేపదే వేధింపులు గురిచేసేవాడు.. ఓ వైపు బ్లాక్మెయిల్తో కోట్లలో డబ్బులు.. మరోవైపు.. వేధింపులు ఆగకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు.. విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అక్షయ్ కుమార్ తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు.. తిరుపతిలో అరెస్టు చేసి విశాఖకు తరలించారు పోలీసులు.. నిందితుడు వద్ద నుండి 65 గ్రాముల బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకులో ఉన్న సుమారు రెండు కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. కొత్త వ్యక్తులతో.. తెలియనివారితో.. పరిచయాలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!