AP Crime: రూ.4 కోట్లు ముంచిన రాంగ్ కాల్..!
- ఓ రాంగ్ కాల్ విలువ అక్షరాల 4 కోట్ల రూపాయలు..
- తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో మహిళాకు ముచ్చేమటలు..
- రూ. 4 కోట్లు వదిలించింది.. ఏళ్ల పాటు నరకం చూపించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కొన్ని రాంగ్ కాల్స్.. కొందరికి కొత్త పరిచయాలను అందిస్తే.. మరికొందరి జీవితాల్లో ప్రేమ చిగురించేలా చేయడం.. ఇంకా కొందరి జీవితాలను సర్వనాశనం చేసిన సందర్భాల్లో ఎన్నో చూశాం.. తాజాగా, ఓ రాంగ్ కాల్ విలువ అక్షరాల 4 కోట్ల రూపాయల వరకు వెళ్లింది.. ముక్కు మొహం తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆ మహిళాకు ముచ్చేమటలు పట్టించింది.. సుమారు రూ. 4 కోట్లు వదిలించింది.. ఏళ్ల పాటు నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది..
Read Also: UP: ‘‘ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్లపై నమాజ్ ఆపడంతో నిరసన..
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 8 ఏళ్ల క్రితం ఓ రాంగ్ కాల్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ కుమార్ అనే వ్యక్తి.. ఆ పరిచయం కాస్తా వారి మధ్య సన్నిహిత్యాన్ని పెంచింది.. కన్నింగ్ ఐడియాలతో ఉన్న అక్షయ్ కుమార్.. ఆమెతో పర్సనల్గా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేశాడు.. ఇక, కొంత సమయం తర్వాత అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. బాధితురాలితో పర్సనల్గా తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించసాగాడు.. దఫా దఫాలుగా డబ్బులు వసూలు చేశాడు.. ఇలా నాలుగు కోట్ల రూపాయల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసి జల్సాలు చేయసాగాడు.. అంతే కాదు, తన కోరిక తీర్చాలంటూ పదేపదే వేధింపులు గురిచేసేవాడు.. ఓ వైపు బ్లాక్మెయిల్తో కోట్లలో డబ్బులు.. మరోవైపు.. వేధింపులు ఆగకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు.. విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అక్షయ్ కుమార్ తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు.. తిరుపతిలో అరెస్టు చేసి విశాఖకు తరలించారు పోలీసులు.. నిందితుడు వద్ద నుండి 65 గ్రాముల బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకులో ఉన్న సుమారు రెండు కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. కొత్త వ్యక్తులతో.. తెలియనివారితో.. పరిచయాలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?