వివాహితకు కాల్ చేసిన తిరుపతి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని వేధించాడు. అతడి వేధింపులతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఈ వేధింపులు భరించలేక వివాహిత గురువారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యయత్నం చేయగా.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకుతోట సౌజన్య మృతి చెందింది.
వరంగల్ లో ఓ కీచక బాబా బాగోతం బట్టబయలైంది. ఎట్టకేలకు ఆ ఫేక్ బాబాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఏనుమామూల ప్రాంతంలో షైక్నాలా లబ్బే అనే కీచక బాబాగా అవతరమెత్తాడు.
వరంగల్ లో హెల్త్ సిటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సుమారు వెయ్యి మంది కార్మికులు పని చేస్తున్నారు. రూ. 20 లక్షల 76 వేల ఎస్ఎప్టీ తో హెల్త్ సిటి నిర్మిస్తున్నామని హరీష్ రావు అన్నారు.
Warangal: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. కానీ కాసులకు కక్కుర్తిపడి పలు ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అంతే కాకుండా అవసరం లేకున్న ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలపైకి తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరంగల్లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
Rain in Warangal: చిన్నగా ప్రారంభమైన గాలి దుమారం క్రమంగా బీభత్సాన్నే సృష్టించింది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో శనివారం రాత్రి అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
వరంగల్ లోని ఎంజీఎం హస్పటల్ నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. పెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఈ ఎంజీఎం దవాఖానాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన ప్రస్తుతం తెలంగాణలో వైరల్ అవుతోంది.
వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతుంది. మేడేను పురస్కరించుకొని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో స్ప ష్టత వచ్చింది. ప్రీతి . మృతికి గల కారణాలపైనా పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆమెది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా 306గా ఈ కేసును నిర్ధారించామని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. వరంగల్ సీపీనీ కలిసిన మెడికో ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ కలిశారు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల లేజర్ షోతో రామప్ప వెలిగిపోతోంది.