CM KCR: రైతులకు కేసీఆర్ భరోసా.. ఎకరానికి 10 వేలు పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పేందు సీఎం కేసీఆర్ ఇవాల నాలుగు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రైతులకు అంండగా వుండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అధైర్య పడకూదని సీఎం కేసీఆర్ రైతులతో స్వయంగా మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. నష్టపరిహారం ఎకరానికి 10 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను సీఎం కేసీఆర్ పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సహాయాన్ని తక్షణమే రైతులకు అందజేస్తామని స్పష్టం చేశారు. నిజానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని, సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు.
Read also: Gutha Sukender Reddy: చైర్మన్ జనార్దన్ రెడ్డి హానెస్ట్ పర్సన్
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు, వాటర్ సెస్ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకుంటే వ్యవసాయం బాగుపడుతుందని అన్నారు. కావున ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమన్నారు సీఎం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరని, రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. అందువల్లే ఎకరానికి 10వేలు ఇండియాలో తొలిసారిగా ప్రకటిస్తున్నానని సీఎం అన్నారు. దీనిని వెంటనే అందజేస్తామని, స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఇలా ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్లను పిలిపించి కౌలు రైతులను కూడా ఆదుకునేలా ఆదేశాలిస్తామన్నారు. ఇక..ఎట్టి పరిస్థితుల్లో నిరాశపడొద్దని, జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా రైతులు భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో ముందుకు పోవాలన్నారు. రైతులు ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దని రైతన్నలకు భరోసా నింపారు సీఎం కేసీఆర్.
Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!