CM KCR: రైతులకు కేసీఆర్ భరోసా.. ఎకరానికి 10 వేలు పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పేందు సీఎం కేసీఆర్ ఇవాల నాలుగు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రైతులకు అంండగా వుండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అధైర్య పడకూదని సీఎం కేసీఆర్ రైతులతో స్వయంగా మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. నష్టపరిహారం ఎకరానికి 10 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను సీఎం కేసీఆర్ పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సహాయాన్ని తక్షణమే రైతులకు అందజేస్తామని స్పష్టం చేశారు. నిజానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని, సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు.
Read also: Gutha Sukender Reddy: చైర్మన్ జనార్దన్ రెడ్డి హానెస్ట్ పర్సన్
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు, వాటర్ సెస్ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకుంటే వ్యవసాయం బాగుపడుతుందని అన్నారు. కావున ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమన్నారు సీఎం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరని, రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. అందువల్లే ఎకరానికి 10వేలు ఇండియాలో తొలిసారిగా ప్రకటిస్తున్నానని సీఎం అన్నారు. దీనిని వెంటనే అందజేస్తామని, స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఇలా ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్లను పిలిపించి కౌలు రైతులను కూడా ఆదుకునేలా ఆదేశాలిస్తామన్నారు. ఇక..ఎట్టి పరిస్థితుల్లో నిరాశపడొద్దని, జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా రైతులు భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో ముందుకు పోవాలన్నారు. రైతులు ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దని రైతన్నలకు భరోసా నింపారు సీఎం కేసీఆర్.
Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?
తాజావార్తలు
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?