Rain in Warangal: వరంగల్ లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం..బోరుమన్న రైతన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain in Warangal: చిన్నగా ప్రారంభమైన గాలి దుమారం క్రమంగా బీభత్సాన్నే సృష్టించింది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో శనివారం రాత్రి అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షంతో వరంగల్ నగరంతో పాటు నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో ప్రజలు వణికిపోయారు. వరంగల్ తూర్పులోని కాశీబుగ్గ గాంధీనగర్, చింతల్, జేబీనగర్, ఆర్ఎస్నగర్, చార్బౌలి తదితర ప్రాంతాల్లో 150 ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరి పోయాయి. సుమారు 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 50 స్తంభాలు కింద పడి విద్యుత్తు సరఫరా ఆగింది. వందల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లపై పడ్డాయి. పలుప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నల్లబెల్లి మండలంలో వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. పలు ఇళ్ల పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయి మొండిగోడలు మిగిలాయి. బాధితులు బోరున విలపిస్తున్నారు. ఈనేపథ్యంలో.. బల్దియా డీఆర్ఎఫ్ టీం ఎంట్రీ ఇచ్చింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. కాశీబుగ్గ, ఓ సిటీ, ఖిలావరంగల్, చింతల్ మైసమ్మ గుడి వద్ద కూలిన వృక్షాలు, చెట్లను తొలగించాయి.
Read also: Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలకు వరాల జల్లు
Also Read
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
చార్బౌలి, నిజాంపురాలో విద్యుత్ వైర్లు తెగి పడటంతో రెండు గంటల పాటు శ్రమించి పునరుద్ధరించారు. ఇక ఎనుమాముల మార్కెట్ సమీపంలో ఒక జిన్నింగ్ మిల్లు ప్రహరీ కూలి.. ఇనుప రేకులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మిల్లులోని పత్తి, పత్తిగింజలు తడిసిపోయాయి. రూ.10 లక్షలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని మిల్లు నిర్వాహకుడు శ్రీమన్నారాయణ తెలిపారు. మార్కెట్లోని అపరాల షెడ్లు కింద ఉన్న వ్యాపారుల సరకును ఖాళీ చేయకపోవడంతో.. స్థలం లేక ఆరుబయట ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి. నల్లబెల్లి మండలంలో ధాన్యం వరద నీటిలో కొట్టుకు పోయాయి. లెంకాలపల్లి, రంగాపురం గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు పడిపోవడంతో నల్లబెల్లి, లెంకాలపల్లి, రుద్రగూడెం, రంగాపురం, శనిగరంతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. అయితే శనివారం రాత్రి మేయర్ గుండు సుధారాణి, ఉపమేయర్ రిజ్వానా షమీమ్ చింతల్, జేబీనగర్, ఆర్ఎస్నగర్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో మాట్లాడి భోజనం ఏర్పాట్లు చేయించారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేలా చూస్తామన్నారు.
Virupaksha: వంద కోట్ల సినిమా ఒటీటీలోకి వచ్చేసింది… స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
తాజావార్తలు
-
The Paradise Trailer: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!