Rain in Warangal: వరంగల్ లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం..బోరుమన్న రైతన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain in Warangal: చిన్నగా ప్రారంభమైన గాలి దుమారం క్రమంగా బీభత్సాన్నే సృష్టించింది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో శనివారం రాత్రి అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షంతో వరంగల్ నగరంతో పాటు నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో ప్రజలు వణికిపోయారు. వరంగల్ తూర్పులోని కాశీబుగ్గ గాంధీనగర్, చింతల్, జేబీనగర్, ఆర్ఎస్నగర్, చార్బౌలి తదితర ప్రాంతాల్లో 150 ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరి పోయాయి. సుమారు 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 50 స్తంభాలు కింద పడి విద్యుత్తు సరఫరా ఆగింది. వందల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లపై పడ్డాయి. పలుప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నల్లబెల్లి మండలంలో వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. పలు ఇళ్ల పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయి మొండిగోడలు మిగిలాయి. బాధితులు బోరున విలపిస్తున్నారు. ఈనేపథ్యంలో.. బల్దియా డీఆర్ఎఫ్ టీం ఎంట్రీ ఇచ్చింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. కాశీబుగ్గ, ఓ సిటీ, ఖిలావరంగల్, చింతల్ మైసమ్మ గుడి వద్ద కూలిన వృక్షాలు, చెట్లను తొలగించాయి.
Read also: Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలకు వరాల జల్లు
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
చార్బౌలి, నిజాంపురాలో విద్యుత్ వైర్లు తెగి పడటంతో రెండు గంటల పాటు శ్రమించి పునరుద్ధరించారు. ఇక ఎనుమాముల మార్కెట్ సమీపంలో ఒక జిన్నింగ్ మిల్లు ప్రహరీ కూలి.. ఇనుప రేకులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మిల్లులోని పత్తి, పత్తిగింజలు తడిసిపోయాయి. రూ.10 లక్షలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని మిల్లు నిర్వాహకుడు శ్రీమన్నారాయణ తెలిపారు. మార్కెట్లోని అపరాల షెడ్లు కింద ఉన్న వ్యాపారుల సరకును ఖాళీ చేయకపోవడంతో.. స్థలం లేక ఆరుబయట ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి. నల్లబెల్లి మండలంలో ధాన్యం వరద నీటిలో కొట్టుకు పోయాయి. లెంకాలపల్లి, రంగాపురం గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు పడిపోవడంతో నల్లబెల్లి, లెంకాలపల్లి, రుద్రగూడెం, రంగాపురం, శనిగరంతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. అయితే శనివారం రాత్రి మేయర్ గుండు సుధారాణి, ఉపమేయర్ రిజ్వానా షమీమ్ చింతల్, జేబీనగర్, ఆర్ఎస్నగర్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో మాట్లాడి భోజనం ఏర్పాట్లు చేయించారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేలా చూస్తామన్నారు.
Virupaksha: వంద కోట్ల సినిమా ఒటీటీలోకి వచ్చేసింది… స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..