Rain in Warangal: వరంగల్ లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం..బోరుమన్న రైతన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain in Warangal: చిన్నగా ప్రారంభమైన గాలి దుమారం క్రమంగా బీభత్సాన్నే సృష్టించింది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో శనివారం రాత్రి అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షంతో వరంగల్ నగరంతో పాటు నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో ప్రజలు వణికిపోయారు. వరంగల్ తూర్పులోని కాశీబుగ్గ గాంధీనగర్, చింతల్, జేబీనగర్, ఆర్ఎస్నగర్, చార్బౌలి తదితర ప్రాంతాల్లో 150 ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరి పోయాయి. సుమారు 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 50 స్తంభాలు కింద పడి విద్యుత్తు సరఫరా ఆగింది. వందల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లపై పడ్డాయి. పలుప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నల్లబెల్లి మండలంలో వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. పలు ఇళ్ల పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయి మొండిగోడలు మిగిలాయి. బాధితులు బోరున విలపిస్తున్నారు. ఈనేపథ్యంలో.. బల్దియా డీఆర్ఎఫ్ టీం ఎంట్రీ ఇచ్చింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. కాశీబుగ్గ, ఓ సిటీ, ఖిలావరంగల్, చింతల్ మైసమ్మ గుడి వద్ద కూలిన వృక్షాలు, చెట్లను తొలగించాయి.
Read also: Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలకు వరాల జల్లు
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
చార్బౌలి, నిజాంపురాలో విద్యుత్ వైర్లు తెగి పడటంతో రెండు గంటల పాటు శ్రమించి పునరుద్ధరించారు. ఇక ఎనుమాముల మార్కెట్ సమీపంలో ఒక జిన్నింగ్ మిల్లు ప్రహరీ కూలి.. ఇనుప రేకులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మిల్లులోని పత్తి, పత్తిగింజలు తడిసిపోయాయి. రూ.10 లక్షలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని మిల్లు నిర్వాహకుడు శ్రీమన్నారాయణ తెలిపారు. మార్కెట్లోని అపరాల షెడ్లు కింద ఉన్న వ్యాపారుల సరకును ఖాళీ చేయకపోవడంతో.. స్థలం లేక ఆరుబయట ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి. నల్లబెల్లి మండలంలో ధాన్యం వరద నీటిలో కొట్టుకు పోయాయి. లెంకాలపల్లి, రంగాపురం గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు పడిపోవడంతో నల్లబెల్లి, లెంకాలపల్లి, రుద్రగూడెం, రంగాపురం, శనిగరంతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. అయితే శనివారం రాత్రి మేయర్ గుండు సుధారాణి, ఉపమేయర్ రిజ్వానా షమీమ్ చింతల్, జేబీనగర్, ఆర్ఎస్నగర్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో మాట్లాడి భోజనం ఏర్పాట్లు చేయించారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేలా చూస్తామన్నారు.
Virupaksha: వంద కోట్ల సినిమా ఒటీటీలోకి వచ్చేసింది… స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..