Pawan Kalyan: రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.. సోషల్ మీడియా వేదికగా రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. వైఎస్ఆర్…
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న సమయంలో.. కీలక మలుపు తిరిగినట్టు అయ్యింది.. విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఫగ్గన్.. విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు.. దానికంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే…
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు ఒకటి. టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణ బాబు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. 2009,14,19ల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు బ్రేకులు వేసేందుకు ఒకసారి పీఆర్పీ, రెండు సార్లు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా అంతంత మాత్రమే. అయినా… వెలగపూడికి మెజారిటీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రజలతో సత్సంబంధాలు, వర్గ…
Vakapalli Case: వాకపల్లి ఆదివాసీ మహిళల అత్యాచారం కేసును కొట్టేసింది విశాఖ సెషన్స్ కోర్టు. విచారణలో నేరం రుజువు కాలేదని తెలిపింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని లీగల్ సెల్ అథారిటీని ఆదేశించింది. 2007 ఆగస్టులో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లిలో ఈ ఘటన జరిగింది. కుంబింగ్ కోసం వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం అత్యాచారాలకు పాల్పడిందని కేసు నమోదు చేశారు. మానవాహక్కులు, పౌర సంఘాలు కల్పించుకోవడంతో వివిధ దశల్లో విచారణ జరిగింది. అయితే, కేసు విచారణ…
Ganta Srinivasa Rao and Buddha Venkanna: ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షా సమావేశం వేదికగా సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను.. ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోను అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించడంతో.. ఆయన బెదిరింపుల నుంచి బుజ్జగించే వరకు తగ్గిపోయారు అంటూ ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం సమీక్ష…
Simhadri Appanna Pushkarini: ప్రముఖ పుణ్యక్షేత్రం.. సింహాద్రి అప్పన్న ఆలయ పరిసరాల్లో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది.. అప్పన్న వరాహ పుష్కరిణిలో తేలిన ఓ వ్యక్తి మృతదేహం తేలింది.. ప్రహ్లాదపురం పల్లినారాయనపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.. రెండు రోజుల క్రితం ఇంటినుండి వెళ్లిన కొలుసు అప్పలరాజు(42) అనే వ్యక్తి.. పుష్కరిణికి చేపల వేటకు వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.. అయితే, చేపలు పడుతూ.. పుష్కరిణిలో పడి మృతిచెందాడా? లేక ఎవరైనా హత్య చేసి అందులో పడవేశారా?…
Selfie Video: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలు సూసైడ్ వీడియో కలకలం రేపింది.. వడ్లపూడి తిరుమల నగర్ లో నివాసముంటున్న చిత్రాడ వరప్రసాద్ భార్య మీరా గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.. భర్త చిత్రాడ వరప్రసాద్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు.. భార్య మీరా తో కలిసి ఓ సెల్ఫీ వీడియో తీసి.. కుమారుడు కృష్ణ సాయి తేజకు వాట్సాప్ పంపించాడు.. ఇక, ఆ తర్వాత సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు..…
G20 Summit 2023: సాగర తీరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు సిద్ధమైంది.. విశాఖ వేదికగా నేటి నుంచి నాలుగు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి.. ఇక, ఈ సదస్సు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విశాఖ సిటీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను (జీఐఎస్) ఘనంగా నిర్వహిం అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ సర్కార్.. ఇక, నేటి నుంచి జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్…