విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
AP Volunteers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీకి వాలంటరీలను తీసుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగుల ద్వారానే ఆ డబ్బులను పంపకాలు చేసింది. కేవలం ఒక్క రోజులోనే చాలా వరకు పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు చేత అదించారు. దీంతో ఇక వాలంటరీ వ్యవస్థతో అవసరం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లను విధులనుంచి ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఆందోళన…
ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె ఇస్తారు అని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు తెలిపారు. ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మధరసా ( జామియా హైదయతుల్ వనాథ్ )లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న ( గురువారం ) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా నేటి ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది.
విజయవాడ నగరంలోని బృందావన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సింధు భవన్ దగ్గర కిరాణా షాపు వ్యాపారి హత్య జరిగింది. వ్యాపారి కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. సదరు యువకుడిని ఆ కిరాణం షాప్ యాజమాని మందలించడంతో దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
Pawan Kalyan Meets Janasena MLA’s in Vijayawada: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేడు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్.. దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన…