బెజవాడ రాజకీయలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలుగుతున్నాను అంటూ ప్రకటించారు.. తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు బెజవాడ మాజీ ఎంపీ.
ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పలు కీలక అంశాలపై సమాచారం అందుకున్న ఆయన, ప్రజాసంబంధాలు నిలబెట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీధిదీపాలు, నీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలు, నగరాల్లో పరిస్థితులను మెరుగుపరచాలని సూచించారు. విజయవాడలో నీరు కలుషితమై మరణాలు సంభవించడంతో, నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరలుకొరకు కింది వీడియో చుడండి.
విజయవాడలో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగు కార్లలో వంశీ ఇంటి వద్దకు వచ్చిన యువకులు.. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో గేట్లు పగులగొట్టే ప్రయత్నం చేశారు.
Nandamuri Ramakrishna Visits Kanaka Durga Temple: ఏపీలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్న నేపథ్యంలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుమారుడు నందమూరి రామకృష్ణ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని ఆయన అమ్మవారిని ఆకాంక్షించారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు…
విజయవాడలో కలుషిత నీటి వల్ల డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురిని మరణించగా.. అధికారులు, పాలకుల అలసత్వంతో కలుషిత నీటి తాగుతూ అనేక మంది హస్పటల్ పాలవుతున్నారు.
విజయవాడలో కలుషిత నీరు అధికారులకు బిగ్ టాస్క్ గా మారింది. కొండ ప్రాంతాలలోని ప్రజలు మున్సిపల్ వాటర్ త్రాగవద్దని దండోరా వేయిస్తున్నారు. సింగ్ నగర్, పాయకాపురం, భవానీపురం, సితారా సెంటర్, ఇంకా పలు ప్రాంతాలలో కలుషిత నీటి బాధితులు ఆరుగురు.. కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేరారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ షరతులు విధించింది.
ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లింది.
అప్పటివరకు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వారి గుండె ఆగినంత పనైంది. దుఃఖాన్ని దిగమింగి ఆ బాలుడిని భుజాన వేసుకొని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరిపోసేందేకు ప్రయత్నించింది.
ఓ వైద్యురాలు చేసిన సాయం ఆ కుటుంబంలో ఆనందం నింపింది. నిండు ప్రాణాన్ని కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంది ఆ డాక్టర్. తన పేరే డాక్టర్ రవళి. ఇంతకు ఏం జరిగిందంటే.. విజయవాడ అయ్యప్పనగర్కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు.