Anam Ramanarayana Reddy: చంద్రబాబు సూచనతో దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం..!
- విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
- కనక దుర్గమ్మ వారి ఆలయాన్ని త్వరలోనే అభివృద్ధి చేస్తాం..
- సీఎం చంద్రబాబు సూచనలతో ముందుకు వెళ్తాం: మంత్రి ఆనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anam Ramanarayana Reddy: విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మ వారిని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందించిన గుడి ఈవో రామారావు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖకు సంబంధించి సమీక్ష కార్యక్రమం రెండు రోజుల నుంచి దేవదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుంది అని తెలిపారు. రాష్టంలో 7 ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి.. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి.. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం జరిగింది.. అలాగే, ఆలయ అభివృద్ధి పనులు గురించి ఈవో వివరించారు అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: BJP MLA Died : బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి మృతి
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఇక, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడే పనే లేదు అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనతో పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు సూచనతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం.. ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం కలగాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం.. నిన్న తెలంగాణ నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు అందరినీ గౌరవించాం అందరికీ వేద పండితుల ఆశీర్వాదం కల్పించి తగిన మర్యాదలు ఇచ్చామని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!