విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి (రుహిక) మృతి చెందింది. గతరాత్రి బద్రీ నాగరాజు కుటుంబం హోటల్ మినర్వా గ్రాండ్లో బసచేసింది.
విజయవాడలోని ఓ హోటల్కు బాంబు బెదిరింపు వచ్చింది. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలో.. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ లేదని గుర్తించారు.
విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు
విజయవాడలోని కృష్ణా తీరంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. జాతీయ డ్రోన్ సమ్మిట్లో భాగంగా పున్నమి ఘాట్లో అతిపెద్ద డ్రోన్ షోను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్లతో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతో పాటు లేజర్ షోను ఏర్పాటు చేశారు.
బెజవాడలో మందుబాబులు హల్చల్ చేశారు.. మద్యం తాగి కారు నడిపి విధ్వంసం సృష్టించారు.. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బబ్బులు గ్రౌండ్ దగ్గరకు కిట్టు, అరుణ్ మద్యం సేవించి కారు నడుపుతూ వచ్చాడు.. మద్యం మత్తులో కారు ఎలా నడుపుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో.. దంపతులను ఢీకొట్టాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు.. ఇక, అడ్డుకున్న పోలీసులతో.. వాగ్వాదానికి దిగారు.
అడిగిన డబ్బులు ఇవ్వలేదని.. మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను నరికి చంపేశాడు. అతికిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కంసాలిపేటలో చోటుచేసుకుంది. కొత్తపేట పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ నగీనా తన భర్త బాజీతో కలిసి కంసాలిపేటలో నివాసం ఉంటోంది. షేక్ నాగిన (32) సమోసాల దుకాణంలో పనిచేస్తుంది. ఆమె…
ప్రజలకు విక్రయించే సరుకులు నాణ్యత, ధరలపై విజయవాడలోని పడమట రైతుబజార్, గురునానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, సంస్థాగత రిటైల్ దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.
బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో సీఐడీ విచారణ ముగిసింది. బ్యాంక్ మేనేజర్ నుంచి సీఐడీ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నరేష్, గోల్డ్ కౌన్సిలర్ మహేష్, నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్పై సీఐడీ కేసు నమోదు చేసింది.
విజయవాడలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది.. మాచవరం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ... విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విధులు నిర్వహిస్తోంది.. అయితే, నిన్న రాత్రి నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది.
బెజవాడలో కలకలం రేపిన రైల్వే లోకో పైలట్ హత్య కేసును ఛేదించారు పోలీసులు.. రెండు రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలోనే లోకో పైలట్ ఏబేలు దారుణ హత్యకు గురవటం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే.. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.. అయితే, హత్యకు పాల్పడిన వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించటంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు.