Paturi Nagabhushanam: పవన్ కల్యాణ్ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..?
- వైసీపీపై బీజేపీ నేత పాతూరి నాగభూషణం ఫైర్..
- గతంలో పవన్ కల్యాణ్ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..?
- ఎన్డీఏ అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paturi Nagabhushanam: గతంలో పవన్ కల్యాణ్ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..? అంటూ మండిపడ్డారు బీజేపీ మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు.. ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించ లేదు.. విశాఖలో కిషోర్, విజయవాడలో రాజేష్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కర్నూలు మొత్తం తిప్పింది వాస్తవం కాదా? డాక్టర్ సుధాకర్ న్యాయం అడిగితే బట్టలు ఊడదీసి కొట్టి అతని మరణానికి కారణమయ్యారు..! చంద్రబాబు, అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్రను అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టలేదా..? పవన్ ను ఎపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Read Also: Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం.. చెకింగ్ చేస్తుండా హోం గార్డు ఈడ్చుకెళ్ళిన డ్రైవర్
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
మా అధ్యక్షురాలు పురంధేశ్వరి మద్యం వల్ల మరణాలు అని చూపిస్తే.. ఆమెపై అసభ్య పోస్టులు పెట్టించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగభూషణం.. మా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పైనా వ్యంగ్య పోస్టులా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు మంచితనం వల్ల చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నారు.. సిసోడియాను వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు .. లోకేష్ రెడ్ బుక్ పూర్తిగా తీయాలి.. చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాను అన్నారు. రవీంద్రరెడ్డి తప్పించుకున్నాడంటే పోలీసులు సహకారం లేదా? అని నిలదీశారు..
Read Also: CJI DY Chandrachud: సీజేఐగా లాస్ట్ వర్కింగ్ డే.. అలీగఢ్ యూనివర్సిటీపై కీలక తీర్పు..
ఇక, అమరావతిలో మీరు పెంచిన తుమ్మచెట్లు పీకడానికి నలభై కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు నాగభూషణం.. పవన్ కళ్యాణ్ రాగానే పంచాయతీల అభివృద్దికి నిధులు ఇచ్చారని గుర్తుచేశారు.. నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి, పారదర్శకంగా పని చేస్తున్నారని ప్రశంసించారు.. చంద్రబాబు అనుభవంతో నేడు వేల కోట్లు నిధులు ఏపీకి తీసుకు వస్తున్నారని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్షా 20వేల కోట్లతో ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు ఏపీ బీజేపీ మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం..
తాజావార్తలు
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!