Seaplane: శ్రీశైలంలో సేఫ్గా ల్యాండ్ అయిన సీ ప్లేన్.. ట్రయల్ రన్ విజయవంతం..
- శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం..
- ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయిన సీ ప్లేన్..
- విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసులు..
- రేపు ప్రారంభించి.. ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seaplane: టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా సీ ప్లేన్ టూరిజానికి శ్రీకారం చుట్టనుంది.. విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్ను నడిపేందుకు సిద్ధమైంది.. ఇక, దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కొనసాగుతోంది.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయ్యింది సీ ప్లేన్.. ఇక, సీ ప్లేన్ ట్రయల్ రన్ ని దగ్గరుండి పరిశీలించారు నంద్యాల జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. కాగా, రేపు విజయవాడలో సీ ప్లేన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంతేకాదు.. విజయవాడ నుంచి సీ ప్లేన్ లో బయల్దేరి.. శ్రీశైలం వరకు ప్రయాణించనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు.. పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.. దీంతో.. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు, పాతాళగంగ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రత బలగాలు..
Read Also: India–Russia Relations: భారత్పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
ఇక, సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా శ్రీశైలంలో ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండింగ్, రోప్ వే, రోడ్డు మార్గంలో దర్శనానికి వెళ్లే దారులలో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు.. శనివారం రోజు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి సీ ప్లేన్ లాంఛనంగా ప్రారంభించి.. సీ ప్లేన్ లో శ్రీశైలం పాతాళగంగంలో ల్యాండ్కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు.. ఇక, అదే సీప్లెన్లో తిరిగి విజయవాడలోని పున్నమి ఘాట్కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!