Gyanavapi masjid row: బయటపడిన శివలింగాన్ని మాకు అప్పగించాలి
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడిందని తెలుస్తోంది. నిజానికి సర్వే రిపోర్టును ఈ నెల 17న వారణాసి కోర్టుకు అందించాలి… అయితే మసీదులోని వాజుఖానా బావిలో శివలింగ ఆకారం బయటపడటంతో సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రెండు రోజులు గడువు కావాలని కోరారు కోర్ట్ కమిషనర్లు. దీనికి వారణాసి కోర్ట్ అనుమతించింది.
మరోవైపు జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీడియో సర్వేను ఆపేయాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీం కోర్ట్ విచారించింది. శివలింగం బయటపడిన ప్రాంతాన్ని రక్షించాల్సిందిగా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. అదే విధంగా ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిల ఉంటే జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగాన్ని తమకు ఇవ్వాలని కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ నాగేంద్ర పాండే డిమాండ్ చేశారు. శివలింగం బయట పడితే అది ‘వజుఖానా’ ఎలా అవుతుందని ప్రశ్నించారు. శివలింగాన్ని కాశీ విశ్వనాథ్ న్యాస్ కు అప్పగిస్తే భగవంతుడికి సక్రమంగా పూజలు చేస్తామని పాండే అన్నారు.ఇదిలా ఉంటే… శివలింగం ఉన్నవజుఖానా పక్కనే ఉన్న గోడను కూల్చివేయాలని వారణాసి కోర్టులలో పిటిషన్ దాఖలైంది.
వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయంలోని భాగంగా ఉన్న జ్ఞానవాపి ఆలయాన్ని మొగల్ పాలకుల సమయంలో ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదుగా మర్చారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి ఆధారం చేకూరుస్తూ… ఆలయంలోని వెనకభాగంలో హిందు ఆలయానికి సంబంధించిన స్తంబాలు, గోడ కనిపిస్తున్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్ట్ లో పిటిషన్ వేయగా… వారణాసి కోర్ట్ వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!