Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు జోక్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా చేపట్టిన సర్వేలో శివలింగం బయటపడడం పెద్ద చర్చగా మారింది.. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడింది.. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.. ఇక, ఈ కేసులో వారణాసి కోర్టు విచారణ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. జ్ఞానవాపి మసీదు కేసును శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు విచారించనున్నట్లు ఇవాళ తెలిపింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు చిత్రీకరణ నివేదికను మసీదు సముదాయంలోని విగ్రహాలను పూజించాలని హిందూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనకు సంబంధించిన కేసులో ఈ ఉదయం కోర్టుకు సమర్పించారు. మూడు ఫోల్డర్లలో ఉన్న నివేదికను మసీదు సముదాయాన్ని చిత్రీకరించిన బృందం.. సీల్డ్ కవర్లో సమర్పించింది. చిత్రీకరణకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలతో కూడిన చిప్ను కూడా అందజేసినట్లు కోర్టు నియమించిన కమిషనర్ విశాల్ సింగ్ తెలిపారు. అయితే జ్ఞాన్వాపి కాంప్లెక్స్ చిత్రీకరణను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్ను విచారిస్తున్న సుప్రీం కోర్టు ఇప్పట్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని వారణాసి కోర్టుకు తెలిపింది. హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
- Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
- Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
జ్ఞానవాపి మసీదు సముదాయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ను వారణాసి కోర్టు విచారిస్తోంది. మసీదులో చిత్రీకరణలో పాల్గొన్న న్యాయవాది ఒకరు, నమాజ్కు ముందు సాంప్రదాయకంగా “వాజూ” లేదా ఇస్లామిక్ శుద్ధి ఆచారాల కోసం ఉపయోగించే చెరువులో “శివలింగం” కనుగొనబడిందని పేర్కొన్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని రక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది, అయితే ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేయకుండా ఆపకూడదని పేర్కొంది. వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయంలోని భాగంగా ఉన్న జ్ఞానవాపి ఆలయాన్ని మొగల్ పాలకుల సమయంలో ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదుగా మర్చారనే వాదన కూడా ఉంది.. దీంతో, సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరగబోతోంది..? సుప్రీం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
-
Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
-
Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!