Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు జోక్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా చేపట్టిన సర్వేలో శివలింగం బయటపడడం పెద్ద చర్చగా మారింది.. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడింది.. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.. ఇక, ఈ కేసులో వారణాసి కోర్టు విచారణ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. జ్ఞానవాపి మసీదు కేసును శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు విచారించనున్నట్లు ఇవాళ తెలిపింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు చిత్రీకరణ నివేదికను మసీదు సముదాయంలోని విగ్రహాలను పూజించాలని హిందూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనకు సంబంధించిన కేసులో ఈ ఉదయం కోర్టుకు సమర్పించారు. మూడు ఫోల్డర్లలో ఉన్న నివేదికను మసీదు సముదాయాన్ని చిత్రీకరించిన బృందం.. సీల్డ్ కవర్లో సమర్పించింది. చిత్రీకరణకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలతో కూడిన చిప్ను కూడా అందజేసినట్లు కోర్టు నియమించిన కమిషనర్ విశాల్ సింగ్ తెలిపారు. అయితే జ్ఞాన్వాపి కాంప్లెక్స్ చిత్రీకరణను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్ను విచారిస్తున్న సుప్రీం కోర్టు ఇప్పట్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని వారణాసి కోర్టుకు తెలిపింది. హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read
- West Bengal: ‘‘బెంగాల్ పుష్ప’’ను తప్పించే కుట్ర.. జహంగీర్ ఖాన్ భార్య అరెస్ట్..
- Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు
- Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
- Gas Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? ఎప్పుడు వస్తుందో సింపుల్గా మొబైల్లో తెలుసుకోండిలా..
జ్ఞానవాపి మసీదు సముదాయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ను వారణాసి కోర్టు విచారిస్తోంది. మసీదులో చిత్రీకరణలో పాల్గొన్న న్యాయవాది ఒకరు, నమాజ్కు ముందు సాంప్రదాయకంగా “వాజూ” లేదా ఇస్లామిక్ శుద్ధి ఆచారాల కోసం ఉపయోగించే చెరువులో “శివలింగం” కనుగొనబడిందని పేర్కొన్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని రక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది, అయితే ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేయకుండా ఆపకూడదని పేర్కొంది. వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయంలోని భాగంగా ఉన్న జ్ఞానవాపి ఆలయాన్ని మొగల్ పాలకుల సమయంలో ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదుగా మర్చారనే వాదన కూడా ఉంది.. దీంతో, సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరగబోతోంది..? సుప్రీం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
IND Vs AFG: భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ విలవిల.. టార్గెట్ 219 పరుగులు..
-
Donald Trump: నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
-
Samantha: తల్లి కాబోతున్న సమంత?
-
Dhanush – Mrunal Thakur: ఇన్నాళ్లూ సీక్రెట్గా లవ్.. ఇప్పుడు సైలెంట్గా విడిపోయారా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!