Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు జోక్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా చేపట్టిన సర్వేలో శివలింగం బయటపడడం పెద్ద చర్చగా మారింది.. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడింది.. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.. ఇక, ఈ కేసులో వారణాసి కోర్టు విచారణ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. జ్ఞానవాపి మసీదు కేసును శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు విచారించనున్నట్లు ఇవాళ తెలిపింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు చిత్రీకరణ నివేదికను మసీదు సముదాయంలోని విగ్రహాలను పూజించాలని హిందూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనకు సంబంధించిన కేసులో ఈ ఉదయం కోర్టుకు సమర్పించారు. మూడు ఫోల్డర్లలో ఉన్న నివేదికను మసీదు సముదాయాన్ని చిత్రీకరించిన బృందం.. సీల్డ్ కవర్లో సమర్పించింది. చిత్రీకరణకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలతో కూడిన చిప్ను కూడా అందజేసినట్లు కోర్టు నియమించిన కమిషనర్ విశాల్ సింగ్ తెలిపారు. అయితే జ్ఞాన్వాపి కాంప్లెక్స్ చిత్రీకరణను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్ను విచారిస్తున్న సుప్రీం కోర్టు ఇప్పట్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని వారణాసి కోర్టుకు తెలిపింది. హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
జ్ఞానవాపి మసీదు సముదాయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ను వారణాసి కోర్టు విచారిస్తోంది. మసీదులో చిత్రీకరణలో పాల్గొన్న న్యాయవాది ఒకరు, నమాజ్కు ముందు సాంప్రదాయకంగా “వాజూ” లేదా ఇస్లామిక్ శుద్ధి ఆచారాల కోసం ఉపయోగించే చెరువులో “శివలింగం” కనుగొనబడిందని పేర్కొన్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని రక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది, అయితే ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేయకుండా ఆపకూడదని పేర్కొంది. వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయంలోని భాగంగా ఉన్న జ్ఞానవాపి ఆలయాన్ని మొగల్ పాలకుల సమయంలో ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదుగా మర్చారనే వాదన కూడా ఉంది.. దీంతో, సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరగబోతోంది..? సుప్రీం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?