దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు.
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లైవ్ విద్యుత్ తీగలను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని 16 లోక్సభ స్థానాలకు సమాజ్వాదీ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్కు 11 సీట్లు కేటాయించినట్లు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించేందుకు అరాచకవాదులను కాల్చి చంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
ఘజియాబాద్ పేరు మార్చే ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. హర్నంది నగర్, గజ్ ప్రస్థ, దూధేశ్వరనాథ్ నగర్ అనే మూడు పేర్లను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పంపనున్నట్లు ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) మేయర్ సునీతా దయాల్ వెల్లడించారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ టీనేజీ బాలిక గత మూడు నెలలుగా అన్నంలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులను మోసం చేస్తోంది. తల్లిదండ్రులు మత్తుతో నిద్రపోగానే.. ఆ అమ్మాయి తన ప్రియుడిని ఇంటికి పిలుస్తోంది.
సోషల్ మీడియా వేదికగా పాటలు వినడానికి మొబైల్ ఫోన్ అడిగిన భర్త కంట్లో కత్తెరతో పొడిచేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ డెవలప్మెంట్ కాలనీలో జరిగింది.
Accused Turned Advocate in UP: నిజం జీవితంలో అసాధ్యమనిపించే సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. పలు సినిమాల్లో చేయని నేరానికి చిన్న వయసులో జైలుకు వెళ్లిన హీరోలు బాగా చదివి పట్టభద్రులై బయటకు వచ్చే సన్నివేశాలు చాలనే చూశాం. లా చదివి తమ కేసు తామే వాదించుకుని నిర్దోషిగా బయటకు వస్తుంటారు. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో మాత్రమే సాధ్యం. నిజ జీవితంలో ఇది అసాధ్యమనే చెప్పాలి. కానీ నిజ జీవితంలోనూ ఇది సాధ్యమేనని చూపించాడు ఓ యువకుడు.…
పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు ట్యూషన్కు పంపించారు. ఇలా టీచర్ దగ్గర ట్యూషన్కు వెళ్తున్న 17 ఏళ్ల బాలుడిని ట్యూషన్ టీచర్ ప్రియుడు హతమార్చిన ఘటన కాన్పూర్లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా టీచర్ ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.