Uttarpradesh: రోజూ పేరెంట్స్కు అన్నంలో నిద్రమాత్రలు పెట్టి.. ప్రియుడిని పిలిపించుకుని రొమాన్స్.. కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ టీనేజీ బాలిక గత మూడు నెలలుగా అన్నంలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులను మోసం చేస్తోంది. తల్లిదండ్రులు మత్తుతో నిద్రపోగానే.. ఆ అమ్మాయి తన ప్రియుడిని ఇంటికి పిలుస్తోంది. రాత్రిపూట పలుమార్లు ప్రియుడు ఇంటికి రావడంతో ఇరుగుపొరుగు వారు కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు అనుమానం రావడంతో రాత్రి పూట అన్నం తినకుండా మాటు వేశారు. ప్రియుడు అమ్మాయిని కలిసేందుకు అక్కడిగా రాగా.. చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. ఆమె ప్రియుడిని అక్కడికక్కడే పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన ఘటన గోరఖ్పూర్ జిల్లా తివారిపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
Read Also: Dawood Ibrahim: దావూద్ పూర్వీకుల ఆస్తి వేలం.. చిన్న ప్లాట్ రూ.2 కోట్లకు విక్రయం
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. గత మూడు నెలలుగా రాత్రి భోజనం చేసే సమయంలో తల్లిదండ్రులకు నిద్ర మాత్రలు ఇచ్చి వారిని నిద్రపుచ్చేది. యువతి ఆ యువకుడిని రాత్రికి రాత్రే తన ఇంటికి పిలిపించుకునేది. దీంతో స్థానికులకు అనుమానం రావడంతో బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం బుధవారం నాడు మరోసారి తన ప్రియుడికి ఫోన్ చేసిన యువతి, అంతకు ముందు తల్లిదండ్రులకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అయితే ఈసారి కాస్త జాగ్రత్తగా ఉండి కూతురు వడ్డించిన ఆహారం తినకుండా యువకుడి రాక కోసం ఎదురుచూశాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. శబ్ధం విని చుట్టుపక్కల వారు కూడా గుమిగూడారు. యువకుడి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించడంతో వారు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో స్థానికులు ఇరువర్గాలను శాంతింపజేసి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Poonam Kaur: తప్పు చేసి.. ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసు .. పూనమ్ ఫైర్
సమాచారం అందుకే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని తివారీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ చెప్పారు. ఈ ఘటన గత మూడు నెలలుగా జరుగుతున్నట్లు విచారణలో తేలింది. ప్లానింగ్ ప్రకారం చాలాసార్లు బాలిక తల్లిదండ్రులకు నిద్రమాత్రలు ఇచ్చి నిద్రపుచ్చి యువకుడిని ఇంటికి పిలిపించేది. బుధవారం కూడా అదే జరగడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వారు భోజనం చేయకుండా.. నిశ్శబ్దంగా దుప్పట్లు కప్పుకుని పడుకున్నట్లు నటించారు. వెంటనే అక్కడికి చేరుకున్న యువకుడిని స్థానికుల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!