UP Murder Case: లాయరైన నిందితుడు.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా బయటకు..
Accused Turned Advocate in UP: నిజం జీవితంలో అసాధ్యమనిపించే సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. పలు సినిమాల్లో చేయని నేరానికి చిన్న వయసులో జైలుకు వెళ్లిన హీరోలు బాగా చదివి పట్టభద్రులై బయటకు వచ్చే సన్నివేశాలు చాలనే చూశాం. లా చదివి తమ కేసు తామే వాదించుకుని నిర్దోషిగా బయటకు వస్తుంటారు. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో మాత్రమే సాధ్యం. నిజ జీవితంలో ఇది అసాధ్యమనే చెప్పాలి. కానీ నిజ జీవితంలోనూ ఇది సాధ్యమేనని చూపించాడు ఓ యువకుడు. 18 ఏళ్ల వయసులో చేయని నేరానికి జైలుకు వెళ్లిన ఓ యువకుడు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై తన కేసు తానే వాదించుకుని నిర్దొషిగా బయటకు వచ్చాడు. తాను మాత్రమే కాదు తనతోపాటు ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన మరో 13 మందిని శిక్ష నుంచి తప్పించాడు.
Also Read: Telangana CM: డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరు కాంప్రమైజ్ కావొద్దు.. రాష్ట్రంలో ఆ మాట వినపడొద్దు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
అచ్చం రీల్ స్టోరీని తలపిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన అమిత్ చౌదరి రియల్ స్టోరి ఇది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ మేరఠ్ నగరంలో 12 సంవత్సరాల క్రితం క్రిషన్ పాల్, అమిత్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు హత్యకు గురయ్యారు. ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆ కేసులో నిందితులను తక్షణం అరెస్టు చేయాలని నాటి యూపీ సీఎం మాయావతి పోలీసులను ఆదేశించడంతో హడావుడిగా 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో చాలా మంది అన్యాయంగా కేసులో ఇరుక్కున్న వారే ఉన్నారు. వారిలో అమిత్ చౌదరి కూడా ఉన్నాడు. అప్పుడు అమిత్ చౌదరి వయసు 18 ఏళ్లు మాత్రమే. ఈ కేసులో రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన అమిత్ 2013లో బెయిల్పై బయటకు వచ్చాడు.
Also Read: Big Breaking: రైతు బంధు నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
వెంటనే న్యాయ విద్యలో చేరాడు. బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదివాడు. బార్ కౌన్సిల్ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం తన కేసును తానే వాదించుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈ కేసులో తనని అన్యాయంగా ఇరికించారని రుజువైంది. ఇటీవలే ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరిస్తూ అమిత్ చౌదరితో పాటు మరో 13 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో, సుమిత్ కైల్, నీతూ, ధర్మేంద్రలను అసలు దోషులుగా కోర్టు నిర్ధారించింది. అయితే వీరిలో సుమిత్ కైల్ 2013లో ఓ ఎన్కౌంటర్లో మ’తి చెందగా. యాడు. ధర్మేంద్ర క్యాన్సర్తో మరణించాడు. ఇక నీతూకు మాత్రం కోర్టు యావజ్జీవం శిక్షతో పాటు 20 వేల జరిమానా విధించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!