Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు తన కుమార్తె వివాహాన్ని ముస్లిం వ్యక్తితో కుదిర్చాడు. ఇరువురు ఇష్టపడటంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇదిలా ఉంటే పెళ్లికి సంబంధించిన పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పెళ్లిపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో చివరకు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మే 28న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈ విషయంలో హిందూ సంస్థల ఒత్తడి కూడా ఉంది.…
Domestic Violence: మాజీ ప్రధాని మనవరాలికి కూడా గృహహింస, వరకట్న వేధింపులు తప్పడం లేదు. మాజీ ప్రధాని వీపీ సింగ్ మనవరాలైన అద్రిజా మంజరీ సింగ్ తాను గృహహింస ఎదుర్కొంటున్నట్లుగా డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఆర్కేష్ నారాయణ్ సింగ్ డియోతో పాటు అతని తండ్రి, కుటుంబ సభ్యులపై డెహ్రడూన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో హెలికాప్టర్లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేదార్నాథ్ ధామ్లోని హెలిప్యాడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హల్ద్ వాని జైలులో ఉన్న 44 మంది ఖైదీల్లో హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. చాలా మంది సోకిన ఖైదీలు ఎన్డీపీఎస్ చట్టం కింద ఉంచబడ్డారు. సునీల తివారీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Haldwani jail: హల్ద్వానీ జైలులో కలకలం రేగింది. ఏకంగా ఓ మహిళలో పాటు 40 మందికి పైగా ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మొత్తం 44 మంది ఖైదీలు ప్రస్తుతం ఆస్పత్రి పాలయ్యారు. ఈ వార్త జైలు అధికారుల్లో కలకలం రేపింది. నెలకు రెండు సార్లు ఆస్పత్రి నుంచి ఓ టీమ్ సాధారణ చెకప్ కోసం జైలుకు వెళ్తుంది. తేలిక పాటి సమస్యలు ఉన్న ఖైదీలందరికీ అక్కడే మందుల్ని అందచేస్తారు. తీవ్ర సమస్యలు ఉన్నవారికి…
తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లను లైంగికంగా వేధించిన కేసులో కోచ్ నరేంద్ర షాను పోలీసులు అరెస్టు చేశారు.
Kedarnath Dham: కేదార్ నాథ్ ధామ్ పోర్టల్ ను భక్తులందరకీ ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి ఈ కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భక్తులు కాలినడకతో పాటు హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ ధామ్ చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కేదార్నాథ్ ధామ్కు హెలికాప్టర్లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది.
ఉత్తరాఖండ్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డెహ్రాడూన్లో గరిష్టంగా కరోనా వైరస్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు రోగులు కూడా చనిపోతున్నారు. ఐదుగురు రోగులు ప్రస్తుతం డూన్ ఆసుపత్రిలో ఐసియులో చేరారు.
Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ముస్సోరీ డెహ్రాడూన్ మార్గంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముస్సోరీ డెహ్రాడూన్ హైవేపై షేర్ ఘడి సమీపంలో ముస్సోరీకి ఐదు కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్కు తిరిగి వస్తుండగా షేర్ఘాడీ సమీపంలో 100…
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ను ఉపద్రవం తాకి దాదాపు మూడు నెలలైంది. అయితే విపత్తు బాధిత ప్రజల బాధలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. జోషిమఠ్ బాధితులు తమ హోటళ్లు ఖాళీ చేయాలని యజమానులు అల్టిమేటం జారీ చేశారు.