Uttarakhand : ఉత్తరాఖండ్లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand : ఉత్తరాఖండ్లో ఛార్దామ్ యాత్రకు ఈ సారి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. చార్దామ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు మంచుకొండల్లోని కొండ చరియలు విగిపడుతుండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొండ చరియలు విరిగి పడటంతో రోడ్లు కూడా ధ్వంసం అవుతుండటంతో వారి ప్రయాణం ముందుకు సాగడం లేదు. భారీగా కొండచరియలు విరిగి పడటంతో సుమారు 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నారు.
చార్ధామ్ యాత్రలో భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. భక్తుల యాత్రకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా రాళ్లు పడటంతో లఖన్పూర్ సమీపంలో లిపులేఖ్-తవాఘాట్ రోడ్డు వంద మీటర్ల మేర ధ్వంసమైంది. దీంతో ధార్చులా, గంజీలో సుమారు 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. దెబ్బతిన్న రోడ్డును మరమ్మత్తు చేయడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఉత్తరకాశి, ఉదంసింగ్నగర్, గర్వాల్, చమోలీ, అల్మోరా సహా పలు జిల్లాల్లో దూళి, ఉరుములతో కూడిన వాన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు కోరారు.
Also Read
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
- White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
- US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
Read Also: AP CM Jagan: చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే..
అత్యవసరమైతేనే బయటకు రావాలని, వాహనాలను జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలని సూచించారు. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చేవారు వాతావరణ పరిస్థితులను బట్టి తమ యాత్రను కొనసాగించాలని అధికారులు సూచించారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని.. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చే ప్రయాణీకులు వాతవారణ సూచన తర్వాతనే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని.. తమ వెంట రెయిన్ కవర్, గొడుగు, వెచ్చని వస్ర్తాలు ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ రెండో వారం వరకు ఈ యాత్ర సాగనుంది.
తాజావార్తలు
-
Yamaha Ethanol Bike: ఇథనాల్తో నడిచే యమహా బైక్ భారత్లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?