Joshimath: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న జోషిమఠ్, భూమిలో పగుళ్లు వచ్చి భూమి కుంగిపోతున్న ఘటన కొన్నాళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అదే జోషిమత్ మరోసారి చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు జోషిమఠ్లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను మరింత పెంచాయి.
ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లోనే దాదాపు 80 మంది మరణించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నల్లని మేఘాలతో హరిద్వార్ చీకటిగా మారిపోయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితిని షెల్ఫ క్లౌడ్ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మామని వెదర్ డిపార్ట్మెంట్ నిపుణులు తెలిపారు. హరిద్వార్ లో కమ్ముకొచ్చిన మేఘాలను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతోన్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులకు ఇవాళ( సోమవారం) ఫోన్ లో మాట్లాడారు. ఉత్తర భారత దేశంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల దెబ్బకు రహదారులు తెగిపోయాయి. ఆయా ప్రాంతాలు, గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద భవనాలు కూడ పేకమేడలా కూలిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో…
ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి బంధువులు అంటే ఎలా ఉంటారు. ఎంతో దర్పంతో.. దర్జాగా ఉంటారు. వారికి రాబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో లగ్జరీగా కాలం గడుపుతారు.