Uttarakhand: బండరాళ్లు వాహనాలపై పడటంతో నలుగురు మృతి.. ఉత్తరాఖండ్లో ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand: బండరాళ్లు వాహనాలపై పడటంతో వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు డీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఉత్తరాఖండ్లో బండరాళ్లు పడిపోవడంతో వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఉత్తరాఖండ్లోని గంగోత్రి వద్ద ప్రయాణీకులు యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భారీ వర్షం కారణంగా కొండలపై నుంచి రాళ్లు పడిపోవడంతో మూడు వాహనాలు ధ్వంసమైన ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
Read also: RaaiLaxmi : హాట్ యాంగిల్స్ లో స్టన్నింగ్ లుక్స్ తో హీటేక్కిస్తున్న హాట్ బ్యూటీ..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
సోమవారం సాయంత్రం ఉత్తరాఖండ్లోని గంగోత్రి వద్ద యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికులతో మూడు వాహనాలు కొండ పక్కనే ఉన్న రోడ్డుపై వెళుతుండగా బండరాళ్లు దొర్లుతూ వచ్చి వాహనాలపై పడ్డాయి. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులంతా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందినవారని తెలిసింది.ధ్వంసమైన వాహనాల అవశేషాలు ప్రమాద స్థాయిని తెలియజేస్తున్నాయి. చిన్న బస్సు ఒకవైపు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మరో రెండు చిన్న వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.
Read also: Cruel Father: ఛీ వీడు అసలు తండ్రేనా? భార్యపై అనుమానంతో ఇద్దరు బిడ్డలను చంపి..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తర భారత రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్ తాజాగా చేరింది. భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాలలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతోపాటు వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లోని పాఠశాలలు వాతావరణం మెరుగుపడే వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్లో, వర్ష సంబంధిత సంఘటనలలో 30 మంది మరణించారు. వంతెనలు కొట్టుకుపోతున్న దృశ్యాలు మరియు వాహనాలు ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు రాష్ట్రంలో వర్షపు విధ్వంసం యొక్క స్థాయికి అద్ధం పడుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?