Uttarakhand: ఉత్తరఖండ్ చమోలిలో పెను ప్రమాదం.. ట్రాన్స్ఫార్మర్ పేలి 10 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand: ఉత్తరాఖండ్లో పెన ప్రమాదం సంభవించింది. చమోలీలో బుధవారం జరిగిప ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. ఇక్కడ నమామి గంగే ప్రాజెక్టుకు సంబంధించిన మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కరెంట్ వ్యాపించి పలువురు కాలి బూడిదయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ 10 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. వీరే కాకుండా చాలామంది గాయపడ్డారు. ఇక్కడ విద్యుదాఘాతానికి గురైన వారిని స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రాజెక్ట్ చమోలి మార్కెట్ సమీపంలో ఉంది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఆ ప్రదేశంలో కరెంట్ వ్యాపించి పలువురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో 24 మంది అక్కడే ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం డెహ్రాడూన్కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటనపై విచారణకు ఆదేశించారు. తానే స్వయంగా చమోలీకి వెళ్లి ఘటన జరిగిన విధానాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చమోలి ఎస్పీ పరమేంద్ర దోవల్ తెలిపిన వివరాల ప్రకారం.. అలకనంద నదికి సమీపంలో బదిలీ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Uttarakhand | 10 people died and several injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval
— ANI (@ANI) July 19, 2023
Read Also:MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ
ఉత్తరాఖండ్లో నిరంతర వర్షం
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో నిరంతరం వర్షాలు కురుస్తున్నాయని, గంగా సహా ఇతర నదులు ఉప్పొంగుతున్నాయి. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా కొండ ప్రాంతాలు నిరంతరం తుపానును ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల వాతావరణం, కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి. రుద్రప్రయాగ్లో వర్షం కారణంగా వచ్చిన వరదలో ఓ హోటల్ కొట్టుకుపోగా, కొంత మందికి గాయాలయ్యాయి. కాగా ఉత్తరకాశీలో పర్వతం నుంచి పడిన శిథిలాలు నేరుగా టెంపోపై వచ్చాయి.
కొండ ప్రాంతాలలో డ్యామ్ నుండి నిరంతరం నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా హరిద్వార్, రిషికేశ్లలో కూడా నదుల నీటి మట్టం పెరిగింది. ప్రమాద స్థాయికి చేరువలో ఉన్న హరిద్వార్లో గంగానది నీటిమట్టం 293 మీటర్లకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గంగానదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంది.
Read Also:Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!