Uttarakhand: ఉత్తరఖండ్ చమోలిలో పెను ప్రమాదం.. ట్రాన్స్ఫార్మర్ పేలి 10 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand: ఉత్తరాఖండ్లో పెన ప్రమాదం సంభవించింది. చమోలీలో బుధవారం జరిగిప ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. ఇక్కడ నమామి గంగే ప్రాజెక్టుకు సంబంధించిన మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కరెంట్ వ్యాపించి పలువురు కాలి బూడిదయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ 10 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. వీరే కాకుండా చాలామంది గాయపడ్డారు. ఇక్కడ విద్యుదాఘాతానికి గురైన వారిని స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రాజెక్ట్ చమోలి మార్కెట్ సమీపంలో ఉంది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఆ ప్రదేశంలో కరెంట్ వ్యాపించి పలువురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో 24 మంది అక్కడే ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం డెహ్రాడూన్కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటనపై విచారణకు ఆదేశించారు. తానే స్వయంగా చమోలీకి వెళ్లి ఘటన జరిగిన విధానాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చమోలి ఎస్పీ పరమేంద్ర దోవల్ తెలిపిన వివరాల ప్రకారం.. అలకనంద నదికి సమీపంలో బదిలీ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
Uttarakhand | 10 people died and several injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval
— ANI (@ANI) July 19, 2023
Read Also:MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ
ఉత్తరాఖండ్లో నిరంతర వర్షం
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో నిరంతరం వర్షాలు కురుస్తున్నాయని, గంగా సహా ఇతర నదులు ఉప్పొంగుతున్నాయి. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా కొండ ప్రాంతాలు నిరంతరం తుపానును ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల వాతావరణం, కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి. రుద్రప్రయాగ్లో వర్షం కారణంగా వచ్చిన వరదలో ఓ హోటల్ కొట్టుకుపోగా, కొంత మందికి గాయాలయ్యాయి. కాగా ఉత్తరకాశీలో పర్వతం నుంచి పడిన శిథిలాలు నేరుగా టెంపోపై వచ్చాయి.
కొండ ప్రాంతాలలో డ్యామ్ నుండి నిరంతరం నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా హరిద్వార్, రిషికేశ్లలో కూడా నదుల నీటి మట్టం పెరిగింది. ప్రమాద స్థాయికి చేరువలో ఉన్న హరిద్వార్లో గంగానది నీటిమట్టం 293 మీటర్లకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గంగానదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంది.
Read Also:Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
తాజావార్తలు
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!