Supreme Court: హంతకులకు ఎలా తెలిసింది..? అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court On Atiq Ahmad killing: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నల్ని సంధించింది. అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లను ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్న సందర్భంలో దుండగులు హత్య చేశారు. ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు కోరతూ న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసి పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది.
Read Also: Joe Biden: బైడెన్కు మతిమరుపు వచ్చిందా..? చివరి విదేశీ పర్యటన కూడా గుర్తు లేదా..?
Also Read
- Success Story: బీటెక్లో 24 బ్యాక్లాగ్స్.. కట్ చేస్తే ఐపీఎస్ అధికారి.. అతడి సక్సెస్ రహస్యం ఇదే..
- E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
అతిక్ అహ్మద్ ను ఆస్పత్రికి తీసుకువస్తున్న విషయం వారికి ఎలా తెలిసింది..? హాస్పిటల్ ప్రవేశ ద్వారం నుంచి ఆంబులెన్స్ లో ఎందుకు తీసుకెళ్లలేదు..? ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారని కోర్టు ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం తరుపున హాజరైన ముకుల్ రోహాత్గీ.. కోర్టు ఆదేశాల మేరకే వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతీ రెండు రోజులకు ఒకసారి వారిని వైద్య పరీక్షలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి ఇది మీడియాకు తెలిసిందని అతను సుప్రీంకు తెలియజేశాడు. అతిక్ అహ్మద్, అతని కుటుంబం గత 30 ఏళ్లుగా నేరాలకు పాల్పడుతున్నారని.. ఈ హత్య భయంకరమైన సంఘటన అని, అందుకు కారణం అయిన నిందితులను పట్టుకున్నట్లు రోహాత్గీ కోర్టుకు తెలిపారు.
హంతకులు న్యూస్ ఫోటోగ్రాఫర్ల వేషంలో వచ్చారని, వారి వద్ద పాస్ లు ఉన్నాయని, కెమెరాలు ఉన్నాయని, గుర్తింపు కార్డులు ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ ఈ హత్యను టీవీల్లో చూశారని, అవి నకిలీవని తేలిందని ఆయన కోర్టుకు తెలిపారు. హత్య జరిగే సమయంలో 50 కన్నా ఎక్కువ మంది అక్కడే ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యపై ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటు చేసిందని, యూపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఈ విషయాన్ని విచారిస్తోందని రోహాత్గీ సుప్రీంకోర్టు కు తెలిపారు. ఏప్రిల్ 15 రాత్రి పోలీసుల సమక్షంలో ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతిక్, అష్రఫ్ లను కాల్చి చంపారు.
తాజావార్తలు
-
116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
-
Morne Morkel: “సీనియర్లకు అండగా నిలుస్తాం”.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
-
Success Story: బీటెక్లో 24 బ్యాక్లాగ్స్.. కట్ చేస్తే ఐపీఎస్ అధికారి.. అతడి సక్సెస్ రహస్యం ఇదే..
-
E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
-
Kandula Durgesh: “మీ అక్రమ సంబంధం నాకు తెలుసు”.. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..