Noida: దీని కోసం “ప్రాంక్” చేస్తారా..? పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఇన్స్టా పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida: సోషల్ మీడియాలో స్టూడెంట్ పెట్టిన సూసైడ్ పోస్ట్ నోయిడా పోలీసులును పరుగెత్తించింది. బాలుడిని కాపాడేందుకు మొత్తం నోయిడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా సెల్ ఇన్స్టాగ్రామ్లో 10వ తరగతి విద్యార్థి పోస్ట్ “ఆత్మహత్య వీడియో”ని చూశారు. బాలుడిని రక్షించేందుకు, బాలుడు ఉన్న లొకేషన్ ట్రేస్ చేసేందుకు పోలీసులు ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుండి సహాయం తీసుకున్నారు. ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ దీక్షిత్ తెలిపారు.
Read Also: Voyager-2: భూమి నుంచి 2 వేల కోట్ల కి.మి. ప్రయాణం.. సిగ్నల్ చేరాలంటే 18 గంటలు.. ఇది వాయేజర్ ఘనత
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
సూసైడ్ వీడియో చూడగానే గౌతమ బుద్ధనగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించింది. వివరాలు తీసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి బాలుడిని కనుగొన్నారు. ఇదంతా చేస్తే పోలీసులకు మాత్రం ఆ బాలుడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు. కొన్ని గంటల పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ సూసైడ్ పోస్ట్ ‘‘ప్రాంక్’’ అని తేలింది. ఇన్స్టాగ్రామ్ లో తనకు వ్యూస్ తక్కువగా రావడంతో, వ్యూస్ పెంచుకునేందుకు ఇలా చేసినట్లు చెప్పాడు. మస్కిటో రిఫిల్లర్ ఆల్ అవుట్ లో లిక్విడ్ ను తీసేసి దాంట్లో నీరు నింపి తాను తాగి చనిపోతున్నట్లు బాలుడు వీడియో తీసి పోస్ట్ చేశాడని పోలీసులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం బాలుడిని వైద్య పరీక్షలకు పంపించి, కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
గతంలో నోయిడా పోలీసులు 20 ఏళ్ల వ్యక్తి ‘‘ అంతా అయిపోయింది’’ అనే పోస్ట్ చూసి అతడిని ఆత్మహత్య నుంచి రక్షించారు. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఇలాంటి కేసుల్ని చేధించి బాధితులను రక్షించేందుకు 2022లో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాతో ఒప్పందం చేసుకున్నారు. రియల్ టైమ్ లో ఇలాంటి ఆత్మహత్యలకు సంబంధించిన పోస్టులను గుర్తించి ప్రజలను రక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..