ట్రంప్ సన్నిహితుడు, జాతీయ వాది చార్లీ కిర్క్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఓ వైపు చార్లీ కిర్క్ సమాధి రహస్యంగా ఉంచడం.. ఇంకోవైపు చార్లీ కిర్క్ను కుటుంబ సభ్యులు, టర్నింగ్ పాయింట్ యూఎస్ బృందమే హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చార్లీ కిర్క్ స్నేహితురాలిగా చెప్పుకుంటున్న కాండేస్ ఓవెన్స్ సంచలన ఆరోపణలు చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉషా వాన్స్ దంపతుల మధ్య ఏదో జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. సంసారంలో గొడవలు మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ రెస్టారెంట్లో ఇద్దరూ గొడవపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
భారతీయులకు హెచ్-1బీ వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. హెచ్1-బీ వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టాక భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సోషల్ మీడియా నిబంధనలు కొత్త తలనొప్పి తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్-1బీ వీసాల అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి.
హమ్మయ్య.. మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అవార్డు దక్కింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపి నాకు.. నోబెల్ శాంతి బహుమతి నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది’’ అని భావించారు.
హెచ్-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. దీంతో చాలా మంది హెచ్-1బీ వీసా దొరకక నానా యాతన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రతినిధులు ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా మాస్కోలో పుతిన్తో అమెరికా దౌత్యవేత్తలు సమావేశం అయ్యారు.
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై ఎప్పుడూ కారాలు.. మిరియాలు నూరే ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు. అయితే ఈ సంభాషణ కూడా కూల్.. కూల్గా కాకుండా.. హాట్హాట్గానే సాగినట్లు తెలుస్తోంది.
Asia Power Index 2025: ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా లోవీ ఇన్స్టిట్యూట్ ఇటీవల తన వార్షిక పవర్ ఇండెక్స్ను విడుదల చేసింది. ఇది ముఖ్యంగా ఆసియా ఖండంలోని దేశాలు తమ ఇతర దేశాలపై చూపే ప్రభావ సామర్థ్యాలను అంచనా వేస్తుంది.
వైట్హౌస్ దగ్గర కాల్పుల ఘటనతో అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుంచి శాశ్వతంగా వలసలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైట్హౌస్ దగ్గర ఆప్ఘన్ జాతీయుడు రెహ్మానుల్లా కాల్పులకు తెగబడ్డాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోనే ఉదాహరణగా ఉంది. గురువారం థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చుని లంచ్ చేశారు.