Trump: ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే.. దేశాలకు ట్రంప్ వార్నింగ్
- ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే
- వాణిజ్య దేశాలకు ట్రంప్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్లపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
ఇది కూడా చదవండి: Abbaya Chowdary: రానున్న రోజుల్లో ‘అబ్బయ్య చౌదరి 2.0’ చూపిస్తా!
Also Read
- E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
- El Nino: అత్యంత ప్రమాదకరంగా ‘ఎల్నినో’.. ప్రపంచానికి నాసా హెచ్చరిక
- Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
- Russia-Ukraine: రష్యా చమురు టెర్నినల్పై ఉక్రెయిన్ భారీ దాడి.. వీడియో పంచకున్న జెలెన్స్కీ
అయితే తాజాగా డెడ్లైన్ దగ్గర పడుతుండడంతో ఆయా దేశాలకు అమెరికా లేఖలు పంపిస్తోంది. ఇదే అంశంపై విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆగస్టు 1 నుంచి వాణిజ్య దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని.. ఈ మేరకు శుక్రవారం నుంచి లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అయితే అదనపు లేఖలు కూడా వస్తాయని పేర్కొ్న్నారు. వాణిజ్య భాగస్వామ దేశాలకు సుంకాల రేట్లను తెలియజేస్తూ లేఖలు ప్రారంభించినట్లు వెల్లడించారు. శుక్రవారం 10-12 దేశాలకు లేఖలు అందుతాయని.. 60-70 శాతం, 10-20 శాతం వరకు సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Telangana : వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు.. మొత్తం 2,363 పోస్టులకు ఆమోదం
జూలై 9లోగా దేశాలు ఒప్పందాలు చేసుకోకపోతే అధిక రేట్లు విధిస్తామంటూ గతంలోనే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటి వరకు యూకే, వియత్నాం ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక చైనా కూడా పరస్పరం సుంకాలు తగ్గించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇక భారతదేశంతో అమెరికా ఒప్పందాన్ని కుదుర్చుకోగలదని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు సుంకాలు తగ్గిస్తాయని.. దీంతో 1.4 బిలియన్ వినియోగదారులు భారత్ మార్కెట్లో అమెరికన్ కంపెనీలు పోటీ పడటానికి సహాయపడుతుందని చెప్పారు. సోయాబీన్స్, గోధుమలు, మొక్కజొన్న, ఆపిల్స్, ఇథనాల్, పాల ఉత్పత్తులు వంటి అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా భారతదేశం తన దేశీయ మార్కెట్ను గణనీయంగా ప్రారంభించగలదని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అయితే వీటిలో చాలా వరకు భారతదేశంలో రాజకీయంగా సున్నితమైనవి. జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సులభమైన మార్కెట్ యాక్సెస్ను వాషింగ్టన్ డిమాండ్ చేసింది. అయితే ఆరోగ్యం మరియు నియంత్రణ సమస్యల కారణంగా ఢిల్లీ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం జరుగుతుందా? లేదా? అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
తాజావార్తలు
-
IND Vs ENG: తిలక్ వర్మ మెరుపులు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్..
-
Tilak Varma: తిలక్ వర్మ అవుటా..? నాటవుటా..? పెవిలియన్ వైపు వెళ్లిన తిలక్ వర్మ మళ్లీ బ్యాటింగ్కు ఎందుకు వచ్చాడు..?
-
Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్లోనే వైభవ్ చెత్త రికార్డు.. ఆ ఘనత నమోదు చేసిన తొలి బ్యాటర్గా..!
-
Shreyas Iyer: మూడు మ్యాచ్ల తర్వాత వైభవ్ను ఆడించడానికి కారణం ఏంటి..? నిజాన్ని నిర్భయంగా చెప్పిన అయ్యర్..
-
Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..