Trump: ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే.. దేశాలకు ట్రంప్ వార్నింగ్
- ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే
- వాణిజ్య దేశాలకు ట్రంప్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్లపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
ఇది కూడా చదవండి: Abbaya Chowdary: రానున్న రోజుల్లో ‘అబ్బయ్య చౌదరి 2.0’ చూపిస్తా!
Also Read
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
అయితే తాజాగా డెడ్లైన్ దగ్గర పడుతుండడంతో ఆయా దేశాలకు అమెరికా లేఖలు పంపిస్తోంది. ఇదే అంశంపై విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆగస్టు 1 నుంచి వాణిజ్య దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని.. ఈ మేరకు శుక్రవారం నుంచి లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అయితే అదనపు లేఖలు కూడా వస్తాయని పేర్కొ్న్నారు. వాణిజ్య భాగస్వామ దేశాలకు సుంకాల రేట్లను తెలియజేస్తూ లేఖలు ప్రారంభించినట్లు వెల్లడించారు. శుక్రవారం 10-12 దేశాలకు లేఖలు అందుతాయని.. 60-70 శాతం, 10-20 శాతం వరకు సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Telangana : వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు.. మొత్తం 2,363 పోస్టులకు ఆమోదం
జూలై 9లోగా దేశాలు ఒప్పందాలు చేసుకోకపోతే అధిక రేట్లు విధిస్తామంటూ గతంలోనే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటి వరకు యూకే, వియత్నాం ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక చైనా కూడా పరస్పరం సుంకాలు తగ్గించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇక భారతదేశంతో అమెరికా ఒప్పందాన్ని కుదుర్చుకోగలదని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు సుంకాలు తగ్గిస్తాయని.. దీంతో 1.4 బిలియన్ వినియోగదారులు భారత్ మార్కెట్లో అమెరికన్ కంపెనీలు పోటీ పడటానికి సహాయపడుతుందని చెప్పారు. సోయాబీన్స్, గోధుమలు, మొక్కజొన్న, ఆపిల్స్, ఇథనాల్, పాల ఉత్పత్తులు వంటి అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా భారతదేశం తన దేశీయ మార్కెట్ను గణనీయంగా ప్రారంభించగలదని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అయితే వీటిలో చాలా వరకు భారతదేశంలో రాజకీయంగా సున్నితమైనవి. జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సులభమైన మార్కెట్ యాక్సెస్ను వాషింగ్టన్ డిమాండ్ చేసింది. అయితే ఆరోగ్యం మరియు నియంత్రణ సమస్యల కారణంగా ఢిల్లీ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం జరుగుతుందా? లేదా? అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
తాజావార్తలు
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!