Trump: ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే.. దేశాలకు ట్రంప్ వార్నింగ్
- ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే
- వాణిజ్య దేశాలకు ట్రంప్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్లపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
ఇది కూడా చదవండి: Abbaya Chowdary: రానున్న రోజుల్లో ‘అబ్బయ్య చౌదరి 2.0’ చూపిస్తా!
Also Read
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
అయితే తాజాగా డెడ్లైన్ దగ్గర పడుతుండడంతో ఆయా దేశాలకు అమెరికా లేఖలు పంపిస్తోంది. ఇదే అంశంపై విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆగస్టు 1 నుంచి వాణిజ్య దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని.. ఈ మేరకు శుక్రవారం నుంచి లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అయితే అదనపు లేఖలు కూడా వస్తాయని పేర్కొ్న్నారు. వాణిజ్య భాగస్వామ దేశాలకు సుంకాల రేట్లను తెలియజేస్తూ లేఖలు ప్రారంభించినట్లు వెల్లడించారు. శుక్రవారం 10-12 దేశాలకు లేఖలు అందుతాయని.. 60-70 శాతం, 10-20 శాతం వరకు సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Telangana : వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు.. మొత్తం 2,363 పోస్టులకు ఆమోదం
జూలై 9లోగా దేశాలు ఒప్పందాలు చేసుకోకపోతే అధిక రేట్లు విధిస్తామంటూ గతంలోనే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటి వరకు యూకే, వియత్నాం ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక చైనా కూడా పరస్పరం సుంకాలు తగ్గించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇక భారతదేశంతో అమెరికా ఒప్పందాన్ని కుదుర్చుకోగలదని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు సుంకాలు తగ్గిస్తాయని.. దీంతో 1.4 బిలియన్ వినియోగదారులు భారత్ మార్కెట్లో అమెరికన్ కంపెనీలు పోటీ పడటానికి సహాయపడుతుందని చెప్పారు. సోయాబీన్స్, గోధుమలు, మొక్కజొన్న, ఆపిల్స్, ఇథనాల్, పాల ఉత్పత్తులు వంటి అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా భారతదేశం తన దేశీయ మార్కెట్ను గణనీయంగా ప్రారంభించగలదని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అయితే వీటిలో చాలా వరకు భారతదేశంలో రాజకీయంగా సున్నితమైనవి. జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సులభమైన మార్కెట్ యాక్సెస్ను వాషింగ్టన్ డిమాండ్ చేసింది. అయితే ఆరోగ్యం మరియు నియంత్రణ సమస్యల కారణంగా ఢిల్లీ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం జరుగుతుందా? లేదా? అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?