ఇరాన్ అణు ముప్పును తొలగిస్తామని అధ్యక్షుడు ట్రంప్ శపథం చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ధిక్కరించిందని.. గతేడాది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నాక కూడా ప్రయత్నాలు మాత్రం ఆపలేదన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతేదీటుగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్పై విరుచుకుపడుతోంది. ఒకేసారి ఇరాన్, లెబనాన్పై ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై లెబనాన్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్కు చిర్రెత్తి.. ఒకేసారి ఆ రెండు దేశాలపై దాడులు చేస్తోంది.
ఇరాన్లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది.
ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చేయడమే తమ లక్ష్యం అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రకటించారు. తాజా పరిణామాలపై పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడారు.
అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. పెద్ద ఎత్తున బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. క్షిపణులు, రాకెట్లు, డ్రోన్ దాడులతో దద్దరిల్లుతోంది. అయితే ఇరాన్ ప్రతీకార దాడులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలపై గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎక్కుపెట్టింది.
మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడితో పశ్చిమాసియా గజగజ వణికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. బాంబ్ దాడులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.
మధ్యప్రాచ్య యుద్ధ భయాందోళనలతో స్టాక్ మార్కెట్ కుదేల్ అయింది. ఉదయం నుంచే మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. చమురు ధరల పెరుగుదలతో మన మార్కెట్ ఢమాల్ అయింది