అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నతమైన హోదాలో ఉన్న నాయకుడు. ప్రపంచంలో గుర్తింపు ఉన్న నేత. అలాంటి నాయకుడిని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అంతమొందించాయి. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
మధ్యప్రాచ్య యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోతుంది. ఈ వారం మార్కెట్ ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. ఇంకోవైపు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇంకోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర అవుతున్నాయి. తగ్గుముఖం పడతాయనుకుంటే రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత సీరియస్గా మారాయి.
విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్న్యూస్ చెప్పింది. గత 5 రోజులుగా ఇరాన్పై యుద్ధం కారణంగా పశ్చిమాసియా సహా గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో గగనతలం మూసేయడంతో విమాన ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
గత నెల 28న అకస్మాత్తుగా ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, అధికార పెద్దలను అంతమొందించింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా అలీ ఖమేనీ (56) ఎన్నికయ్యారు. 80 మందితో కూడిన పండితుల కమిటీ మోజ్తబా పేరును ఆమోదించినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు, ప్రాణ నష్టం జరుగుతున్నాయి. తాజాగా బుషెహర్ విమానాశ్రయంపై దాడి చేశాయి. దీంతో పార్క్ చేసిన ప్రయాణికుల విమానం ధ్వంసమైంది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో చమురు ట్యాంక్లన్నీ నిలిచిపోయాయి.