మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడితో పశ్చిమాసియా గజగజ వణికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. బాంబ్ దాడులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.
మధ్యప్రాచ్య యుద్ధ భయాందోళనలతో స్టాక్ మార్కెట్ కుదేల్ అయింది. ఉదయం నుంచే మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. చమురు ధరల పెరుగుదలతో మన మార్కెట్ ఢమాల్ అయింది
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. దీంతో ఫోర్డో, నతాంజ్ , ఎస్ఫహాన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా హెచ్చరించినట్లుగానే ఇరాన్పై యుద్ధం మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది.
భారతదేశం టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్లను ఇటీవలే అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది
తాను ఎంత కాలం ఉంటానో తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని నివాసంలోకి సాయుధ చొరబాటుదారుడు ప్రవేశంపై మాట్లాడారు. అనుమానితుడు తుపాకీ, ఇంధన డబ్బాను తీసుకుని మార్-ఎ-లాగోలోకి అక్రమంగా ప్రవేశించాడని తెలిపారు. చొరబాటుదారుడిని భద్రతా దళాలు కాల్చి చంపాయని పేర్కొన్నారు. షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని.. కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్. కెన్నడీ హత్యలే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.…
మెక్సికోలో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య తర్వాత దేశం అట్టుడికింది. ఎల్ మెన్చో అనుచరులు రణరంగం సృష్టించారు. ఆస్తుల ధ్వంసంతో పాటు వాహనాలు తగలబెట్టారు. దాదాపు 20 రాష్ట్రాల్లో బీభత్సం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మలేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. తీరప్రాంత రాష్ట్ర రాజధాని కోటా కినాబాలుకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
మధ్యప్రాచ్యంలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్పై దాడి కోసం అమెరికా భారీ ప్రణాళికలు రచిస్తోంది. తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. తాజాగా మధ్య ప్రాచ్యంలో బలగాలు మోహరింపు కోసం అగ్ర రాజ్యం భారీ ‘ఎయిర్ బ్రిడ్జి’ని ఏర్పాటు చేసింది.
ప్రపంచ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ న్యాయమూర్తులపై విరుచుకుపడ్డారు. ‘‘రాడికల్-లెఫ్ట్ డెమొక్రాట్లు మూర్ఖులు.. లాప్డాగ్లు’’ అంటూ ధ్వజమెత్తారు.