వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను అమెరికా సైన్యం అరెస్ట్ చేసింది. శనివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున సైనిక దాడి చేసి అందుపులోకి తీసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇరాన్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లో పరిపాలనా భవనం దగ్గరకు నిరసనకారులు రావడంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 16 మంది ఆందోళనకారులు మృతిచెందారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడి అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందంటూ ఇటీవల రష్యా సైనిక అధికారులు.. అమెరికాకు ఆధారాలు సమర్పించింది. తాజాగా ఇదే అంశంపై ఆదివారం ఎయిర్ఫోర్స్ వన్లో ట్రంప్ స్పందించారు.
ప్రపంచ వ్యాప్తంగా వెనిజులా వ్యవహారం కాకరేపుతున్న వేళ్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు.
వెనిజులా వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం వెనిజులాపై అమెరికా భీకరమైన సైనిక చర్యకు దిగి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను.. అతని భార్య సిలియా ఫ్లోర్స్ను కారకాస్లో బంధించి అమెరికా తరలించింది.
అమెరికాలో భారతీయ యువతి నిఖితా గోడిశాల (27) దారుణ హత్యకు గురైంది. మేరీల్యాండ్లోని మాజీ ప్రియుడి అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నూతన సంవత్సర వేడుకల తర్వాత మహిళ కత్తిపోట్లకు గురై చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికా-వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి దిగిపోవాలని గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. కానీ ట్రంప్ హెచ్చరికలను నికోలస్ ఖాతర్ చేయలేదు. తాజాగా అమెరికా రంగంలోకి దిగింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సఫలీకృతం అవుతున్న తరుణంలో ఉక్రెయిన్ తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై భారీ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (34) ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో తొలి ముస్లిం మేయర్గా ప్రమాణం చేశారు. గతేడాది జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.
న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఖురాన్పై చేయి వేసి ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. న్యూయార్క్లోని మాన్హట్టన్లోని సబ్వే స్టేషన్లో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో మమ్దానీ ప్రమాణ స్వీకారం చేశారు. ‘‘ఇది నిజంగా జీవితకాల గౌరవం, ప్రత్యేకత’’ అని మమ్దానీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Gold Rates: న్యూఇయర్ వేళ బంగారం, సిల్వర్ ధరలు ఇలా! భారత…