మలేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. తీరప్రాంత రాష్ట్ర రాజధాని కోటా కినాబాలుకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
మలేషియాలోని బోర్నియో ద్వీపంలోని సబా రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున 12:57 గంటలకు 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. సునామీ హెచ్చరిక జారీ చేయబడలేదు. అయితే ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఎలాంటి సమాచారం అందించలేదు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మలేషియా వాతావరణ శాఖ తెలిపింది.