హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద మూడు రోజుల పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అండర్-16 బాయ్స్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని జిల్లాల నుంచి వందల మంది ఈ సెలక్షన్స్ కి హాజరు అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్లేయర్స్ రావడంతో HCA వెనక్కి పంపించింది.
India Schedule for ICC World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15, 16న ముంబై , కోల్కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్లు.. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ 2023లో భారత తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్ 8న…
బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఒక్కటి.. అయితే ఉప్పల్లో మాత్రం భారత జట్టు ఆడే సూచనలు కన్పించడం లేదు. భారత జట్టు ఆడే మ్యాచ్లకు సంబంధించి బీసీసీఐ సిద్దం చేసిన డ్రాప్ట్ షెడ్యూల్లో ఉప్పల్ స్టేడియం పేరు లేనట్లు కనిపిస్తుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. అయినా ఆ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలపైనే ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆధారపడి ఉన్నాయి. అందుకే, హైదరాబాద్ ఆడే మ్యాచులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ తన సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ తలపడుతుంది.
ఈడెన్ గార్డెన్స్లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్లో కేకేఆర్ 5 పరుగుల తేడాతో ఎస్ ఆర్ హెచ్ పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా మరో మ్యాచ్ జరగబోతోంది.. ముంబై ఇండియన్స్తో హైదరాబాద్ సన్రైజర్స్ ఢీకొనబోతోంది.. ఈ సీజన్లో ఇప్పటి వరకు రెండు జట్ల ప్రదర్శనకు పెద్ద తేడా ఏమీ లేదు.. ముంబై నాలుగు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు సాధించగా.. హైదరాబాద్ కూడా నాలుగు మ్యాచ్లు ఆడి రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది.. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కిందినుంచి వరుసగా రెండు, మూడో స్థానాలకే పరిమితం అయ్యాయి.. అయితే, హైదరాబాద్లోని…
మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ లో జరిగే తొలి మ్యాచ్ లో హైదరాబాద్ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు.
సరికొత్త టీమ్ తో ఈ సీజన్ లో అడుగుపెడుతున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ అన్నారు. మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది కెప్టెన్ ల విషయంలో ప్రతీ సీజన్ లో కొంత తడబాటు ఉండేది.. ఈసారి మార్క్రమ్ కెప్టెన్సీ తో SRHకి అదనపు బలం వచ్చింది.. యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ , నటరాజన్ మా బౌలింగ్ స్ట్రేంత్ పెరిగిందని భువనేశ్వర్ కుమార్ అన్నారు.
ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేల మంది క్రికెట్ అభిమానుల సందడితో దద్దరిల్లనుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన మూడునెల వ్యవధిలోనే ఉప్పల్ లో టీమ్ ఇండియా న్యూజిల్యాండ్ వన్ డే మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది.