ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. అయినా ఆ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలపైనే ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆధారపడి ఉన్నాయి. అందుకే, హైదరాబాద్ ఆడే మ్యాచులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ తన సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ తలపడుతుంది. సొంత అభిమానుల మధ్య గెలిచి పరువు నిలుపుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుంటే.. రాయల్ ఛాలెంజర్స్ కు మాత్రం తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్ పై అందరు ఫోకస్ చేశారు.
Also Read : BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
వాస్తవానికి, ఈ మ్యాచ్ ఓడిపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి. చివరి లీగ్ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి.. ఒకవేళ గెలిచినా, ఇతర జట్ల ఫలితాలు బెంగళూరు ప్లే ఆఫ్స్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే, హైదరాబాద్ పై గెలిచి తన ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని బెంగళూరు జట్టు చూస్తోంది. కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఫామ్ లో ఉండడం బెంగళూరు జట్టుకు సానుకూలాంశంగా ఉంది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన బెంగళూరు ఉత్సాహంతో ఉంది. మరి, ఈ జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్ నిలువరిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాలను చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియెన్స్ జట్లు వరుసగా ఉన్నాయి.
Also Read : Malladi: నవలా చిత్రం… ‘8 ఎ.ఎం. మెట్రో’!