Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాలోని దేర్హా గ్రామంలో దారుణం జరిగింది. అత్యాచారం కేసును విత్ డ్రా చేసుకోవడం లేదని అత్యాచార బాధితురాలిని నిందితుడు, అతని ఇద్దరు సోదరులు అత్యంత దారుణంగా నరికి చంపారు. పట్టపగటు అందరూ చూస్తుండగా ఈ దాడికి ఒడిగట్టారు. హంతకులు అశోక్, పవన్ నిషాద్ కొన్ని రోజుల మందు బెయిల్పై విడుదలయ్యారని పోలీసులు మంగళవారం వెల్లడించారు.