అమెరికాలో చేయబడిన ప్లాన్, ప్రొఫెషనల్ షూటర్ల నెట్వర్క్, దేశంలోని రాష్ట్రాల్లో నిల్వ చేయబడిన ఆయుధ నిల్వలు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన క్రైమ్-థ్రిల్లర్ స్టోరీని పోలి ఉంటుంది.
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నౌవి, వైమానిక విన్యాసాలను ఇవాళ (ఆదివారం) నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.
భారత దేశంలో ఎన్నికల హాడావుడి కొనసాగుతుంది. ఈ ఎన్నికలను బీజేపీ సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉందని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- అమెరికా సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన కొనసాగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు. భారత్పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం గురించి కీలక అప్డేట్ వచ్చింది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్ల అమ్మకానికి యూఎస్ అనుమతినిచ్చింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ రోజు సాధ్యమయ్యే విక్రయాల గురించి యూఎస్ కాంగ్రెస్కు తెలియజేస్తుంది.
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. నిరాశ్రయుడి ఆశ్రయం ఇచ్చి ఓ వ్యక్తిపై జాలి చూపిన భారత్కు చెందిన విద్యార్థి యూఎస్లో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు.