BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చకు దారి తీసింది. యూకే-ఇండియా సంబంధాలపై ప్రభావం పడేలా ఉండటం ఉంది. మరోవైపు యూకే, ఇండియాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉండగా ఈ డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేయడంపై అక్కడి ఎంపీలు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ఈ వీడియోను బ్యాన్ చేసింది. వలసవాద మనస్తత్వానికి నిదర్శనం ఈ డాక్యుమెంటరీ అంటూ భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
Samosa and Tea: మధ్యాహ్నం భోజనం చేసినా.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. పక్కాగా టీ తాగాల్సిందే.. ఇక, అంతకు ముందే.. సమోసానో.. భజ్జీలో.. బోండాలో.. పునుగులో ఇలా ఏవో ఒకటి.. అక్కడ అందుబాటులో ఉన్నదాన్ని బట్టి లాగించేస్తుంటారు.. వీటిలో ఎక్కువ ప్రియోర్టీ మాత్రం సమోసాకే ఉంటుంది.. వేడి వేడి టీకి ముందు సమోసా తింటే ఆ కిక్కే వేరు.. ఇది కేవలం మన దేశానికి పరిమతం కాలేదండోయో.. ఇది ఇతర దేశాలకు కూడా పాకేసింది.. చాయ్, సమోసా…
PM Modi is one of the most powerful persons on planet: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ఇటు ఇండియాలోను అటు యూకేలోనూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలు దెబ్బతినకుండా పలువురు బ్రిటన్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు జల్లుకురిపిస్తున్నారు. తాజాగా యూకే చట్టసభ సభ్యుడు కరణ్ బిలిమోరియా మాట్లాడుతూ.. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు అని ఆయన అన్నారు.
BBC Documentary on Modi: భారతదేశంలో కొంతమంది సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువ అని భావిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కొంతమందిని సంతోషపెట్టడానికి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని.. వారు దేశ గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలో అయినా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
BBC Documentary on Modi: గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర ఉందని ఆరోపిస్తూ బీబీసీ ప్రసారం చేసిన ‘‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది వలసవాద మనస్తత్వంలో ఉందని ఆరోపించింది భారత విదేశాంగశాఖ. మరోవైపు పలువురు బ్రిటన్ ఎంపీలు కూడా ఈ డాక్యుమెంటరీని తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మాజీ భారత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, మేధావులు బీబీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BBC Documentary on Modi: 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని నరేంద్రమోదీపై డాక్యుమెంటరీ రూపొందించింది. ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ అనే పేరుతో రెండు సీరీస్ లను బీబీసీ రూపొందించింది. అయితే ఈ డ్యాక్యుమెంటరీపై భారత్ తో పాటు బ్రిటన్ లో కూడా చర్చ మొదలైంది. ఇప్పటికే భారత ప్రభుత్వం బీబీసీ చర్యలను ఖండించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్న ఓ ఎంపీ ప్రధాని మోదీపై చర్చను లేవనెత్తాడు. అయితే…
BBC documentary on Prime Minister Modi: గుజరాత్ 2002 అల్లర్ల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ‘‘ ఇండియా: మోదీ క్వశ్చన్’’ డ్యాకుమెంటరీ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. బీబీసీ వలసవాద మనస్తత్వంతో, ప్రచారంలో భాగంగా ఇదంతా చేస్తోందని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 2002 గుజరాత్ అల్లర్లలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నరేంద్ర మోదీకి క్లీన్…
Package Containing Uranium Seized At London Airport: ఉగ్రవాదులు మళ్లీ యూరప్ దేశాల్లో దాడులకు పాల్పడబోతున్నారా..? అంటే తాజాగా జరిగిన ఓ ఘటన అందుకు బలాన్ని చేకూరుస్తోంది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో ఏకంగా యురేనియం పట్టుబడింది. యురేనియంతో కూడిని ప్యాకేజీ దొరకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 29న తనిఖీల్లో భాగంగా దీన్ని కనుక్కున్నారు. అయితే ఈ ప్యాకేజీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒమన్ నుంచి…
Rishi Sunak wants all pupils to study maths to age 18: యూకే ఆర్థిక సంక్షోభంతోె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భనం పెరిగింది. దీంతో పాటు ఇంధన సంక్షోభం ఆదేశాన్ని వేధిస్తోంది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మొత్తం యూరప్ దేశాలపై పడింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రిటన్ ను గట్టేక్కించేందుకు కన్జర్వేటివ్ పార్టీ లిజ్ ట్రస్ ను కాదని భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ను ప్రధానిగా ఎన్నుకున్నారు.
Actor Satish Shah's Response To Racist Comment At UK's Heathrow Airport: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నా.. ఇంధన సంక్షోభంతో బాధపడుతున్నా.. ఆర్థిక వ్యవస్థను దిగజారుతున్నా బ్రిటన్ కు బుద్ధి రావడం లేదు. అక్కడ కొంతమంది ప్రజలు ఇంకా జాత్యాంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించిందనే సోయి కూడా లేదు. చివరకు తమన ఆర్థిక పరిస్థిని చక్కదిద్దే బాధ్యతను భారతీయ మూలాలు ఉన్న రిషి సునక్ కు అప్పగించారు.