రాజన్న సిరిసిల్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. నన్ను గెలిపిస్తే సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ మంజూరి చేపిస్తాను అని హామీ ఇచ్చారు.
2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేది అని నిర్మలా సీతారామన్ అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చిండు.. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్.. కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని ఆమె ఆరోపించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్.. కరెంట్ వెలుగులు తెచ్చిందే కాంగ్రెస్.. కాంగ్రెస్ కరెంట్ తెస్తే.. కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? అని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 25న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ-జనసేన నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు 2జీ, 3జీ, 4జీలు.. బీజేపీ 2జీ, 3జీ, 4జీ కాదు తెలంగాణ ప్రజల పార్టీ అని అమిత్ షా అన్నారు. మోడీ కృషితోనే చంద్రాయన్ విజయవంతం అయింది.. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని విధానంగా బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు.
బీఎస్పీ అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఆయన సతీమణి కొత్త సరితా రెడ్డి గడప గడప ప్రచారం నిర్వహిస్తూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి కొత్త మనోహర్ రెడ్డిని గెలిపించాలని మహిళలను ఆమె కోరారు.
నన్ను తిట్టే హక్కు బీజేపీ నాయకులకు లేదు.. కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పని చేసే వ్యక్తిని కాదు.. మిలాగా లొంగిపోను.. అద్వానీ నాకు గురువు.. ఆయన మాకు సంస్కారం నేర్పారు.. మీలాగా అసభ్యకరంగా మాట్లాడను.. నాపై మాట్లాడిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోండి అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం అవినీతి ఆరోపణలతో కోటాను కోట్లు డబ్బుల సంచులు తీసుకున్నందుకే బండి సంజయ్ పదవిని తీసేయడం జరిగింది.. ఇయ్యాలా ఆ నోట్ల కట్టలతో ఓటుకు 20 వేలైనా వెదజల్లి గెలుస్తా అనే డబ్బు మదంతో పోటీలో దిగాడని మంత్రి గంగుల కమలాకర్ దుయ్యబట్టారు.
కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేశాడు అంటే పొరపాటు.. ప్రజలకి సంబంధం లేదని చెప్పాలని అనుకుంటుంటే తప్పు.. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు త్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం.. ప్రజల పోరాటం అది అని చిదంబరం పేర్కొన్నారు.