కాంగ్రెస్ ఎల్లారెడ్డిలో నిర్వహించిన మన ఊరు-మన పోరు సభపై టీఆర్ ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిజామాబాద్ టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కౌంటర్ ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ రేవంత్ రెడ్డి, పీసీసీ నేతలపై విరుచుకుపడ్డారు. సభలో ఎల్లారెడ్డి ప్రజలు లేరు, బయట నుంచి తెచ్చుకున్నారు. నువ్వు పట్ట పగలు దొరికిన 420 గాడివి. నిన్ను ప్రజలు పిచ్చి కుక్క అంటున్నారని విమర్శించారు ఎమ్మెల్యే సురేందర్. స్టేజి మీద ఎల్లా రెడ్డి…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. 5 వ రోజు కొనసాగనుంది శాసనసభ. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపడతారు. ఇవాళ చేపల పెంపకం, హైదరాబాద్ నగరంలో నాలాల అభివృద్ధి కార్యక్రమం గురించి చర్చిస్తారు. అలాగే, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీతో పాటు ఇతర నగరాల్లో ఆర్టీసీ బస్ ల సౌకర్యం గురించి మంత్రులు సమాధానం ఇస్తారు, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, భూపాల…
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావేశాలుగా పరిగణించనందున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వుండదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై అనవసరంగా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడింది. బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు…
ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి ప్రారంభోత్సవం రాజకీయ రచ్చకు తెర లేపింది. .వైద్యుల పోస్టులు భర్తీ చేయకుండా ప్రారంభోత్సవం చేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. చివరకు కాంగ్రెస్ – టీఆర్ఎస్ శ్రేణులు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లడం ఇప్పడు హాట్ టాపిక్ అయింది. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 150 కోట్లతో ఏర్పాటు చేశారు. ఆసుపత్రి 250 పడకల ఆస్పత్రిలో 8 డిపార్ట్మెంట్లలో 366 మంది వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు పూర్తి…
ఈనెల 6,7,8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ సంబురాలకు రెడీ అవుతోంది. 6వ తేదీన సంబురాలు ప్రారంభం అవుతాయి. కేసీఆర్ కి రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం వుంటుందని టీఆర్ఎస్ తెలిపింది. కేసీసఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలయిన…
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన…
రాష్ట్రంలో జరుగుతున్న కోల్ స్కాంపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ప్రధానికి.. కోల్ ఇండియాకి ఫిర్యాదు చేశాం. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్ ని సీఎండీగా కొనసాగిస్తున్నారు. 50 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోంది. ప్రధాని, కోల్ సెక్రెటరీ లకు ఫిర్యాదు చేశాం. కేంద్ర మైనింగ్ మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తే..మేము చేసేది ఏమీ లేదు ప్రధాని కార్యాలయం చూసుకుంటుంది అని చెప్పారు. సెంట్రల్…
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కి రేవంత్ కౌంటర్ ఇచ్చారు. “మొసలి కన్నీరు” కార్చడం మీ నాయకత్వ ప్రావీణ్యం.ప్రధాని మోదీ తెలంగాణ తల్లిని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను, తెలంగాణ తల్లిని ప్రధాని నరేంద్రమోడీ…
తెలంగాణపై మోడీ మాటలు మంటలు రాజేస్తున్నాయి. తెలంగాణకు తల్లి లాగా..సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందని, మోడీ..కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సీమాంధ్రకు కూడా ఆర్దికంగా ఆదుకోవడం కోసం పోలవరం..స్పెషల్ స్టేటస్ ఇచ్చింది కాంగ్రెస్. ఎనిమిదేళ్ళలో విభజన హామీలు అమలు చేయకుండా మోడీ ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారన్నారు. తెలంగాణ అప్పుల ఊబిలోకి పోవడానికి మోడీ..కేసీఆర్ కారణం అన్నారు. తెలంగాణలో ఆశించిన ఉద్యోగాల కల్పన లో కేసీఆర్ వైఫల్యం చెందారన్నారు. ఐటీఐఆర్…
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి…