Bhatti Vikramarka: పట్టువదలని భట్టి పాదయాత్రతో వత్తిడి పెంచేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన పట్టు పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి నాయకుడే లేకుండా పోయినప్పటికీ ఉన్న నాయకులు భట్టి విక్రమార్కను ఎదుర్కొనే శక్తి లేకుండా చేయగలిగారు. అయినప్పటికి సంతృప్తి చెందకుండా నియోజకవర్గంలో ఏ మాత్రం తన పట్టు చేజారి పోకుండా చూసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఏ పథకం వర్తింప చేసిన అది తన నియోజకవర్గానికి వచ్చేలా చూసుకుంటారు విక్రమార్క. గత ఎన్నికల్లో భట్టి విక్రమార్కను ఓడించడానికి అధికార పార్టీ గట్టి ప్రయత్నాలే చేసింది. అయినప్పటికీ ఆయన గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారు. అది కూడా హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన భట్టి విక్రమార్క ఆతరువాత మధిర నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎగా పోటీ చేస్తున్నారు. మూడుసార్లు అక్కడ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఆ పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటారు. అదే కోవలో జిల్లాలో ర్యాలీలను చేయడంలో దిట్టగా పేరు పొందారు. గతంలో ట్రాక్టర్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలు, మోటార్ సైకిల్, సైకిళ్ల మీద ర్యాలీలను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ర్యాలీలు ఉపయోగపడతాయని ఆయన అభిలాష.
Also Read
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 32 రోజుల పాటు 506 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ప్రతి మండలంలో 7 రోజుల వరకు ఈ యాత్ర ఉండనుంది. గత కొంత కాలం క్రితం చింతకాని మండలానికి చెందిన మరియమ్మ లాకప్ డెత్ వ్యవహారంలో తాను తీసుకున్న ఉద్యమం వల్ల ఆ కుటుంబానికి ఉద్యోగం రావడమే కాకుండా లాకప్ డెత్ కు బాధ్యులైన వారిని డిస్మిస్ చేయించగలిగారు.అదే విధంగా దళిత బంధు పథకం కూడా ముందు తన నియోజకవర్గాన్ని ఎన్నికయ్యేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకుని వచ్చి చేయించగలిగారు. దీంతో నియోజకవర్గంలో భట్టి విక్రమార్కకు మంచి పట్టు లభించింది. అధికారపార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని పథకాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మళ్లీ పాదయాత్ర పేరుతో ప్రజకు మరింత చేరువయ్యేలా భట్టి విక్రమార్క ఈ యాత్ర ను చేపడుతున్నారు. ముదిగొండ మండలం యడవల్లి గ్రామం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఎర్రుపాలెం మండలం జమలాపురం వద్ద ఈ యాత్ర ముగింపు చేయనున్నారు. యాత్ర ముగింపు సందర్బంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జాతీయ నాయకులను ఆహ్వానించాలని కూడా భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచాలని భట్టి విక్రమార్క భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!