రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఒక పార్టీ బీ ఫాం తీసుకుని గెలిచి.. వెంటనే మరో పార్టీలో చేరడం మామూలే. హైదరాబాద్లో బీజేపీ తన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ కార్పోరేటర్లు పార్టీలు మారడం పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. తాజాగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన కార్పొరేటర్ నరేంద్రకుమార్ పార్టీ మారారు. బీజేపీ తరఫున గెలిచి నిన్న టీఆర్ఎస్ లో చేరారు కార్పొరేటర్ నరేంద్రకుమార్. బీజేపీలో గెలిచి పార్టీ…
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని హైదరాబాద్ నగరంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్న తరుణంలో ఆయన కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు అందడం కొసమెరుపు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదని టీఆర్ఎస్ యూత్ విభాగం నేతలు సోమవారం నాడు సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Read Also: షెడ్యూల్ ప్రకారమే… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎంపీగా బండి సంజయ్ గెలిచినప్పటి…
టీఆర్ఎస్ నేత, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో యాక్టివ్గా వుంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకుముందు తన పర్యటనల్లో ప్రభుత్వ అధికారులపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఉద్యోగం చేస్తారా ఇంటికెళతారా అని మండిపడ్డారు. తాజాగా పార్టీలోని కొందరు నేతల్ని ఆయన టార్గెట్ చేశారు. నేను గ్రామాల్లో పర్యటించినప్పుడు పక్కా టీఆర్ఎస్లో కొనసాగే నాయకులు మాత్రమే పాల్గొనండి. రెండో ఆలోచన చేసేవారికి ఇక నుంచి ఫోన్లు రావు. పినపాక…
కరోనా మహమ్మారి వల్ల సామాన్యులతో పాటు ఎందరో రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి.. శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి ఎర్రబెల్లి ప్రస్తుతం…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గాదరి మారయ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీఈటీ మాస్టర్గా సేవలందించారు. ఆయన స్వస్థలం నల్గొండ మండలం నర్సింగ్భట్. ప్రస్తుతం నల్గొండ పట్టణంలో కుటుంబంతో కలిసి జీవిస్తున్న మారయ్యకు శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. Read Also: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్ కాగా…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా… ఆరింటిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ ధాటికి ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతయిందనే చెప్పాలి. అయితే మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు. ఈరోజు జరిగిన…
ధాన్యం సేకరణపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన అధికార టీఆర్ఎస్.. తదుపరి కార్యాచణ ఏంటి? తాటతీస్తాం.. మెడలు వంచుతామని చెప్పిన ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. మరి.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్..! తెలంగాణలో వరి రైతుల ఇక్కట్లు ఎలా ఉన్నాయో.. ధాన్యం రాశుల దగ్గర చూస్తే తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే వర్షం పాలై.. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక.. కొనుగోలు చేసేవారు…
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని తన ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే…
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు… టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు.. అయితే, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖరాసిన గట్టు రామచంద్రరావు… “నేను మీ అభిమానాన్ని పొందడంలో.. గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను.. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు..…