Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Trs War On Center Over Grain Procurement

ధాన్యం సేకరణపై కేంద్రంపై టీఆర్‌ఎస్‌ యుద్ధం..!

Published Date :December 11, 2021 , 1:01 pm
By Lakshmi Narayana
ధాన్యం సేకరణపై కేంద్రంపై టీఆర్‌ఎస్‌ యుద్ధం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ధాన్యం సేకరణపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన అధికార టీఆర్‌ఎస్‌.. తదుపరి కార్యాచణ ఏంటి? తాటతీస్తాం.. మెడలు వంచుతామని చెప్పిన ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. మరి.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్‌ ముందు ఉన్న ఆప్షన్స్‌ ఏంటి?


పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌..!

తెలంగాణలో వరి రైతుల ఇక్కట్లు ఎలా ఉన్నాయో.. ధాన్యం రాశుల దగ్గర చూస్తే తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే వర్షం పాలై.. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక.. కొనుగోలు చేసేవారు ముందుకు రాక.. అక్కడే గుండె ఆగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్రం మెడలు వంచుతామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. మధ్యలోనే పార్లమెంట్‌ను బహిష్కరించారు. సమస్య ఎక్కడిది అక్కడే ఉంది. ధాన్యం సేకరణ విషయంలో ఎవరి వాదన వారిదే. రైతును పట్టించుకునేవారే లేరు. ఇప్పుడెలా? పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్‌ భవిష్యత్‌ కార్యాచరణ ఏంటన్నది ఒక చర్చ.

కేంద్రం ప్రకటనపై సంతృప్తి చెందని టీఆర్ఎస్‌..!

నవంబర్‌ 29న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల మొదటిరోజే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపుతోందని.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు ఎంపీలు. ప్రతిరోజూ ఈ అంశంపై వాయిదా తీర్మానాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు వ్యూహం మార్చి… వివిధ అంశాలపై ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో కూడా ఎంపీలు పాల్గొన్నారు. చివరకు కేంద్రం వివరణ ఇచ్చినా.. అంతా డొంకతిరుగుడుగా ఉందని ఆరోపిస్తూ.. నిరసనగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు.

మరోసారి టీఆర్‌ఎస్‌ఎల్పీ విస్తృత సమావేశం నిర్వహిస్తారా?
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీ ధర్నా..?

పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్‌ చేశారు సరే.. ధాన్యం సేకరణపై టీఆర్ఎస్‌ ఇప్పుడేం చేయబోతుంది? భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తుందా? టీఆర్ఎస్‌ ముందున్న ఆప్షన్స్‌ ఏంటన్నదానిపై గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వివిధ విషయాలు పార్టీ వర్గాల్లో చర్చకు వస్తున్నాయట. త్వరలోనే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఒక వాదన ఉంది. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఢిల్లీ తీసుకెళ్లి ధర్నా నిర్వహించే యోచన కూడా పార్టీ దగ్గర ఉందట.

ఎంపీల స్థాయిలో నిరసనలా..? అసెంబ్లీ కేంద్రాల్లో ఆందోళనలా..?

ఆ మధ్య ధాన్యం సేకరణపై హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో టీఆర్ఎస్‌ నిరసన ఏర్పాటు చేస్తే.. గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌ వచ్చారు. జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి. అదే రీతిలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈ దఫా నిరసనలు చేపట్టొచ్చని తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఆందోళనలు నిర్వహించిన ఎంపీలే రాష్ట్రాంలో తమ నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలు చేయొచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నాలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన జరిగినట్టు తెలుస్తోంది. మరి.. వరి రైతుకు అండగా అధికార టీఆర్‌ఎస్‌ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • off the record
  • paddy procurement
  • telangana
  • TRS party

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions