ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మూడో తరం ఇప్పుడు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, నటుడు శ్రీరామ్ కుమార్తె శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేసి…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని దుమ్ముదులుపుతున్నాడు. ఒక్క హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు మహేష్. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్లో సత్తా చాటిన మహేష్.. రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోబోతున్నాడు. అయితే ఈ లోపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో రాజకీయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.…
సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! త్రివిక్రమ్ శ్రీనివాస్తో మహేశ్ చేయనున్న సినిమా ముగిసిన అనంతరం.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది పట్టాలెక్కడానికి చాలా సమయమే ఉన్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతవరకూ…
మహేశ్ బాబు తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి సినిమా కంటే ముందే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు మహేశ్. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించటం విశేషం. త్రివిక్రమ్ తో మహశ్ ఇంతకు ముందు ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు చేశాడు. టీవీల్లో అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాల్లో ఈ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ సినిమాలో పూజా హేగ్డే…
‘సర్కారు వారి పాట’తో సూపర్ సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహేష్ ఈ మూవీ స్క్రిప్టుని లాక్ చేశారని.. దాంతో ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూట్ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక SSMB28 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్నఈ సినిమాలో.. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమానికి కూడా హాజరైన పూజా హెగ్డేను.. ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. 2024లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కమిట్ అయిన సినిమాలను చకాచకా పూర్తి చేసి ఆ తర్వాత 2023లో పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెడతాడని వినిపించింది. ఇదిలా ఉంటే పవన్ కమిట్ మెంట్స్ లో హఠాత్తుగా మరో సినిమా యాడ్ అయింది. ఆల్ రెడీ పూజ కూడా జరుపుకుందని సమాచారం. దీనికి నటుడు, దర్శకుడు సముతిర ఖని దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది తమిళంలో సముతిర…
‘సర్కారు వారి పాట’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 సినిమా చేస్తోన్న మహేశ్, ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సెట్స్ మీదకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి ఆయన రెండేళ్ల బల్క్ డేట్స్ కూడా ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. దీని తదనంతరం తన 30వ ప్రాజెక్ట్…
తమిళంలో మంచి విజయం సాధించిన ‘వినోదయం సీతమ్’ను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే! ఒరిజినల్కి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ప్రధాన పాత్రలో నటించిన సముద్రఖని ఈ రీమేక్కు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు పవన్ 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత రాలేదు. అదిగో, ఇదిగో అంటూ.. యూనిట్ సభ్యులు చెప్పడమే తప్ప, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. నిజానికి.. భీమ్లా నాయక్…
‘సర్కారు వారి పాట’తో ఘనవిజయం సొంతం చేసుకున్న సూపర్స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్లో చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలోనే ముగియగా.. జులై రెండో వారం నుంచి సెట్స్ మీదకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై క్రేజీ వార్తలు ఒక్కొక్కటిగా తెరమీదకొస్తున్నాయి. లేటెస్ట్గా ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇదో పీరియాడిక్ డ్రామా…
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో #SSMB28 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! జులై రెండో వారంలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా గురించి లేటెస్ట్గా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో విలన్గా నందమూరి తారకరత్న నటించనున్నాడట! ట్విటర్లో తారకరత్న పేరిట ఉన్న అకౌంట్ నుంచి #SSMB28 అనే హ్యాష్ట్యాగ్తో ఒక ట్వీట్ పడినప్పటి నుంచి, ఈ ప్రచారం జోరందుకుంది. నిజానికి.. అది వెరిఫైడ్ అకౌంట్ కాదు. అయినప్పటికీ అది…