కొత్తగా చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఫుడ్ కు సంబంధించిన అన్ని వీడియోలు ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఉల్లిపాయలు, ఇతర కూరగాయలతో చేసిన పకోడీలు తినితిని బోర్ కొట్టిందనుకుంటా… కొత్తగా ట్రైచేశాడు. రుచి బాగుండటంతో కమర్షియల్గా ఆ కొత్త పకోడీలు వేయడం మొదలుపెట్టారు. వినియోగదారులకు కూడా నచ్చడంతో కొనుగోలు పెరిగింది. ఇంతకీ ఆ కొత్తరకం పకోడీలు ఎంటని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా.…
ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు టెక్ దిగ్గజం గూగుల్ ఘన నివాళి అర్పించింది. కమల్ రణదివె భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి…
ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫొటోగ్రాఫర్లు ఆరుదైన ఫొటోలు తీసేందుకు తాపత్రయపడుతుంటారు. ఆరుదైన ఫొటోల కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించి ఒపిగ్గా ఫొటోలు తీస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ ఫొటో కూడా చేరిపోయింది. 300 మంది మగ, ఆడ వాలంటీర్లను నగ్నంగా నిలబెడ్డి ఫొటో తీశాడు. ఈ ఫొటోలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ఫొటోను తీయడం…
హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్ ..ఇప్పుడు ఇది ట్విటర్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ ట్రెండింగ్ కారణం ఏమిటి? జనసేన అధినేత పవన్కల్యాణ్పై నటుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్తో ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. అసలు ఏం జరిగిందో చూస్తే… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జగన్ సర్కార్ పై…
1950- 60 తరువాత ఆఫ్ఘనిస్తాన్లో ట్రెండీ కల్చర్ మొదలైంది. పాశ్చాత్య దుస్తులు ధరించడం అలవాటు చేసుకున్నారు. అయితే, 1996 నుంచి 2001 మధ్యలో తాలిబన్లు ఆక్రమణలతో తిరిగి బుర్ఖాలు ధరించాల్సి వచ్చింది. 2001 తరవాత తిరిగి ప్రజాస్వామ్య పాలనలోకి రావడంతో ప్రజలు స్వతంత్రంగా జీవించడం మొదలు పెట్టారు. తమకు నచ్చిన దుస్తులు వేసుకుంటున్నారు. కాగా, ఇప్పుడు మరోసారి సడెన్గా తాలిబన్ల పాలనలోకి ఆఫ్ఘన్ వెళ్లడంతో అక్కడి మహిళలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా దుస్తుల విషయంలో ఆంక్షలు విధించవద్దని,…
ఇండియాకు అన్ని ఫార్మాట్స్లో విజయాలు అందించిన కెప్టెన్ ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం మహెంద్రసింగ్ ధోని. పించ్ హిట్టర్గా, బెస్ట్ ఫినిషర్గా ధోనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నది. ఒకవైపు క్రికెట్లో రాణిస్తూనే మరోవైపు ఫ్యాషన్ రంగంలో ధోని మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. తాజాగా ధోని సరికొత్త హెయిర్స్టైల్తో ఆకట్టుకుంటున్నాడు. ధోనీ హెయిర్స్టైల్, లుక్ అద్భుతంగా ఉన్నాయని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. టెస్ట్, వండే మ్యాచ్ల నుంచి తప్పుకున్న ధోని పొట్టి…
మేకలు ఆకులు మాత్రమే తింటాయి అన్నది పాత మాట. ఈ మేక వెరీ స్పెషల్. ఇది ఆకులనే కాకుండా చేపలను కూడా లాగించేస్తోంది. ప్లేటులో ఉంచిన చేపలను కరకర నమిలి మింగేసింది. ఆకులు తినితిని బోర్ కొట్టిందేమో ఇలా చేపలను తింటోంది ఆ మేక. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఒక్కసారిగా వైరల్ అయింది. ఆకులు అలమలు తినే మేకలోనే అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటే, చేపలను తినే మేకలో ఇంకెన్ని…
మహారాష్ట్రలోని నలసోపారా పట్టణంలో నివసిస్తున్న 80 ఏళ్ల గణపత్ నాయక్ కి మహరాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారులు షాకిచ్చారు. ఇటీవల దాదాపు 80 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు అందుకున్న తరువాత ఆయనకు హై బీపీ పెరగడంతో ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహరాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్ఇడిసిఎల్) విద్యుత్ బిల్లును సరిచేసింది. బిల్లులో పేర్కొన్న ఈ ఎనభై కోట్ల అధిక మొత్తం టైపింగ్ మిస్టేక్ ఫలితంగా వచ్చిందని…