కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు గూగుల్ నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు టెక్ దిగ్గజం గూగుల్ ఘన నివాళి అర్పించింది. కమల్ రణదివె భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి టిష్యూ కాన్సర్ పరిశోధనా ప్రయోగశాలను బొంబాయిలో నెలకొల్పారు ఈమె 1917 నవంబరు 11 న మహారాష్టలో జన్మించారు. ఈమె పూణె లోని బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
ఫెర్గుస్సన్ కాలేజీ నుండి బోటనీలో గ్రాడ్యుయేషన్ చేశారు. కణ జీవశాస్త్రంలో ఎం.యస్సీని పూణే లోని వ్యవసాయ కాలేజీలో చదివిన తర్వాత బొంబాయి యూనివర్శిటీ నుంచి కణజీవశాస్త్రంలో పి.హెచ్ డీ చేశారు. ఎక్స్ పెరిమెంటల్ బయాలజీలో ఆమె అనేక పరిశోధనలు నిర్వహించారు. ఈమె ఇండియన్ కాన్సర్ పరిశోధనా కేంద్రంలో పాథాలజిస్ట్ వి.ఆర్.ఖనోల్కర్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేశారు. రణదివే పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేసేందుకు విదేశాలకు కూడా వెళ్ళారు. డాక్టర్ కమల రణదివె ఎన్నో ప్రయోగాలు చేశారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
1955లో బ్రెస్ట్ కేన్సర్ మీద యూరోపియన్ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ తో కలసి అధ్యయనం చేశారు. సెల్ టిష్యూ, ఆర్గాన్ కల్చర్ మీద 1972 లో పరిశోధనలు చేశారు. భారత ప్రభుత్వ ప్లానింగ్ కమిషన్ వారి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఏకైక మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. మహారాష్ట్ర కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుల కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 1991 లో మహారాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. దాదాపు 250 పరిశోధనా పత్రాలను, గ్రంథ రచనలు వెలువరించిన డాక్టర్ కమల టాటా మెమోరియల్ సెంటర్ వారి కేన్సర్ రీసెర్చ్ సెంటర్ లో ఎమిరిటస్ సైంటిస్ట్ గా చిరకాలం పనిచేసి పదవీవిరమణ చేసి 2001 లో మరణించారు.
డాక్టర్ కమల పలు గౌరవ పురస్కారాలు అందుకున్నారు. 1982 లో బనారస్ హిందూ యూనివర్శిటీ మహిళా మహా విద్యాలయం వారి డిస్టింగ్విష్డ్ హ్యూమన్ అవార్డ్, 1991 లో అద్వితీయ పరిశోధనకు గాను టాటా మెమోరియల్ గోల్డెన్ జూబ్లీ అవార్డ్ అండ్ మెమెంటోను, 1992 లో భారత ప్రభుత్వం వారి పద్మభూషణ్ గౌరవ పురస్కారాలు పొందారు. డా.కమల్ రణదివె జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ రూపొందించింది. ఈ గూగుల్ డూడుల్ ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!