ఆ పార్టీలో పదవులు రాకుంటే పెద్దస్థాయిలో పంచాయితీ జరుగుతుంది. తీరా పదవులు ఇస్తే పని చేయడం లేదట. తాపీగా రిలాక్స్ అవుతున్నారట. వర్క్ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన నాయకులు ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్లకు నో వర్క్.. నో మూడ్..!తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లు.. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డితోపాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ను నియమించారు. మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేశ్గౌడ్, అజారుద్దీన్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్లు ఆ…
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్సు కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సభ్యత్వం తీస్కున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అందేలా, ప్రమాదం జరిగి ఏదైనా శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాదం తీవ్రతను బట్టి పరిహారం అందుతుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ…
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు జనం. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అని చెప్పిన కేసీఆర్ని నమ్మి ఓటేశారు. రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ ఇప్పటికీ జరగలేదన్నారు జగ్గారెడ్డి. కానీ లక్ష కు లక్ష వడ్డీ అయ్యింది. కేసీఆర్ని నమ్మి రైతులు నమ్మి ఓటేస్తే…
మాజీ ఎంపీ మధుయాష్కీ ఎన్టీవీ ఫేస్ టు ఫేస్లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కుదిరించలేకపోతున్నాం. వందల కోట్లు వున్న నేతలు వాళ్ళు వేసే ఎంగిలిమెతుకుల కోసం పార్టీకి ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి సామాజిక వర్గం వస్తుందని భావించాం. కానీ ఆందోళనకర రీతిలో హుజురాబాద్లో 3వేలకు ఓట్లు పడిపోవడం దారుణం. దీని వల్ల పార్టీలో మనోస్థైర్యం తగ్గింది. క్షణికానందం కోసం కాంగ్రెస్ నేతలు…
తెలంగాణ కాంగ్రెస్లో డీసీసీ అధ్యక్షుల వాయిస్ పెరిగిందా..? పీసీసీ లక్ష్యంగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? ఆ వ్యాఖ్యల వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేక పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపించారా? రేవంత్ అందుబాటులో ఉండటం లేదని డీసీసీల ఫిర్యాదుతెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ సభ్యత్వాలు చేయించాలని చెబుతుంటే..! సరే.. మా సంగతేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నల వెనక వ్యూహం ఏంటి? జిల్లాలలో ఉన్న అసంతృప్తిని పీసీసీ దృష్టికి…
శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీనే క్రమశిక్షణ తప్పిందా? ఇన్నాళ్లు క్రమశిక్షణ కమిటీపై రాని ఆరోపణల ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? చిన్నారెడ్డి కామెంట్స్తో మరో మలుపు తిరిగిన రగడతెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లక్ష్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మెదక్ పర్యటన సమాచారం ఇవ్వలేదనే అంశంపై మొదలై.. రేవంత్ కూడా కోవర్టే అనే వరకు విమర్శలను…
తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ కూడా టెన్షన్ పెడుతోంది.. ఇక, ఎవ్వరినీ వదిలేదు అనే తరహాలో సామాన్యులు, నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు.. అధికారులు.. ఎవరైతే నాకేంటి అనే విధంగా.. అందరినీ టచ్ చేస్తోంది మాయదారి కరోనా.. తాజాగా, టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి కరోనా పాజిటివ్గా తేలింది.. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. నిర్ధారణ…
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అంటే..బస్సుకు డ్రైవర్ లాంటి వాడే అన్నారు. బస్సు చక్కగా లేకుంటే.. సరిద్దిద్దు కో అని చెప్పిన. ఇది కూడా చెప్పొద్దా..? కెసిఆర్ నా కంటే పెద్ద.. తిట్టను.. నా కంటూ ఓ పద్ధతి ఉంటుందన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ ఉద్యమం సమయంలో కెసిఆర్ నీ సంగారెడ్డి కి ఎట్లా వస్తవో రా..? అని ఎదురు నిలబడ్డా. నా కంటే ఎక్కువ కొట్లాట చేసిర్ర ఎవరన్నా..? నా మీద చెయ్…
టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. దీంతో.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్ హత్య చేస్తోందంటూ మండిపడ్డ ఆయన.. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు అని.. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందన్న రేవంత్.. మేం ఇంట్లో…
సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ రెడ్డి వరంగల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని కోసం ఉదయం ఆయన సిద్ధంకాగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత సోమవారం కూడా రేవంత్…