కేసీఆర్-మోడీది మ్యాచ్ ఫిక్సింగ్.. మధు యాష్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎంపీ మధుయాష్కీ ఎన్టీవీ ఫేస్ టు ఫేస్లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కుదిరించలేకపోతున్నాం. వందల కోట్లు వున్న నేతలు వాళ్ళు వేసే ఎంగిలిమెతుకుల కోసం పార్టీకి ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి సామాజిక వర్గం వస్తుందని భావించాం. కానీ ఆందోళనకర రీతిలో హుజురాబాద్లో 3వేలకు ఓట్లు పడిపోవడం దారుణం. దీని వల్ల పార్టీలో మనోస్థైర్యం తగ్గింది.
క్షణికానందం కోసం కాంగ్రెస్ నేతలు కొందరు డబ్బులు తీసుకుని నాకు ఓటు వేయలేదు. కవితను ఓడించాలని చూశారు కానీ అక్కడ బీజేపీకి లాభం అయింది. కాంగ్రెస్ పార్టీ బలమయిన అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత నాపై వుంది. పార్టీలో భవిష్యత్ లేదంటే యువత దూరం అవుతారు. పార్టీలో కుటుంబంలో భార్యకు, కూతురికి, కోడలికి, కొడుక్కి అందరికీ ఇవ్వడం మంచిది కాదు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
రాహుల్ గాంధీ ఆలోచనతో ముందుకెళతాను. ఎన్నికలు వచ్చేనాటికి మేం ఎక్కడ పోటీచేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. డీఎస్ పార్టీలోకి మళ్ళీ వస్తాననే ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడడం వల్ల డీఎస్ నష్టపోయారు. ఆయన పార్టీలోనే వుండి వుంటే సీఎం అభ్యర్ధి అయివుండేవారు. పార్టీ ఓకే అంటే ఎవరూ అడ్డుకోవడం కుదరదు. డీఎస్ వెళ్ళాక పార్టీనుంచి అంటిపెట్టుకున్నవారిని కాపాడుకోవాలి. వారికి మంచిస్థానం ఇవ్వాలి.
డీఎస్ పార్టీలోకి వస్తే ఆయన కొడుకు అరవింద్ బీజేపీ ఎంపీగానే వుంటారా ? అంటే అధిష్టానం నుంచి సరైన సమాధానం రాలేదు. కేసీఆర్-మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. మోడీని పొగుడుతూ వుంటారు. 2022లోనే ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఆర్ఎస్ఎస్ ప్లానింగ్ లో ఉంది. కొత్త పార్లమెంట్ భవనం పూర్తయ్యాక రాజ్యాంగాన్ని మోడీ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే పనిలో ఆర్ ఎస్ ఎస్ వుంది. కేంద్రం, రాష్ట్రం కలిసి వున్నాయి. ముందస్తు ఎప్పుడైనా రావచ్చు. ఈమధ్యకాలంలో న్యాయవ్యవస్థ ఔన్నత్యం పెరిగింది. జస్టిస్ ఎన్వీరమణ గారు వచ్చాక న్యాయవ్యవస్థమీద నమ్మకం పెరిగిందన్నారు మధు యాష్కీ.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!