గాలి కాలుష్యం ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలోనే కాకుండా.. పాకిస్తాన్లో కూడా బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్లలో పూర్తి లాక్డౌన్ విధించారు. తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముల్తాన్ నగరంలో AQI 2000 దాటింది. లాహోర్లో AQI 1100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వం లాహోర్, ముల్తాన్లలో పూర్తి లాక్డౌన్ విధించిందని పాక్ మీడియా…