Pakistan: తీవ్ర గాలి కాలుష్యం.. పాకిస్తాన్లోని ఈ నగరాల్లో లాక్డౌన్
- పాకిస్తాన్లో బీభత్సం సృష్టిస్తున్న గాలి కాలుష్యం
- పంజాబ్ ప్రావిన్స్లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్లలో పూర్తి లాక్డౌన్
- తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు
- ముల్తాన్ నగరంలో 2000 దాటిన AQI
- లాహోర్లో AQI 1100 కంటే ఎక్కువగానే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాలి కాలుష్యం ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలోనే కాకుండా.. పాకిస్తాన్లో కూడా బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్లలో పూర్తి లాక్డౌన్ విధించారు. తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముల్తాన్ నగరంలో AQI 2000 దాటింది. లాహోర్లో AQI 1100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వం లాహోర్, ముల్తాన్లలో పూర్తి లాక్డౌన్ విధించిందని పాక్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ARY న్యూస్ రిపోర్టు ప్రకారం.. లాహోర్ ప్రపంచంలోని రెండవ అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించారు.
Read Also: TPCC Mahesh Goud : కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు
Also Read
- Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
- 200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
- Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
- CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
పంజాబ్ సీనియర్ ప్రావిన్షియల్ మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ.. పొగమంచు, కాలుష్యం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల గురించి వివరించారు. దీనివల్ల ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడిందని.. ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ఇప్పటి పరిస్థితులను కోవిడ్ సమయంలో అనుభవించిన ప్రమాదాలతో పోల్చాడు. మరోవైపు.. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా.. పంజాబ్ ప్రభుత్వం నవంబర్ 24 వరకు హయ్యర్ సెకండరీ స్థాయి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Air passenger Record: దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు
ఇదిలా ఉంటే.. పంజాబ్ ప్రావిన్స్లో కేవలం ఒక వారంలోనే 600,000 మందికి పైగా ప్రజలు కాలుష్య సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. గత వారంలో 65,000 మందికి పైగా ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. ఈ దృష్ట్యా, ప్రాంతీయ ప్రభుత్వం పారామెడికల్ సిబ్బంది సెలవులను రద్దు చేసింది. OPD సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించింది.
తాజావార్తలు
-
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!