భారత్ను రెండుసార్లు విభజించిందే నెహ్రూ.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్! భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్క్లిఫ్ లైన్తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు. దీంతో దేశంలో వ్యవసాయానికి భారీ నష్టం జరిగిందన్నారు. కొంత కాలానికి పాకిస్తాన్తో తాను చేసుకున్న సింధూ నది ఒప్పందంతో 80 శాతం నీరు ఆ దేశానికి వెళ్లిపోయాయని.. భారత్కు…
షాకింగ్.. అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు సతీమణి మృతి! ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. ఇక, కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్లో పూర్తయినట్లు తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు, రుక్మిణి…
లిక్కర్ స్కాం కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..! లిక్కర్ స్కాం కేసులో సిట్ (SIT) రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన రెండో చార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టులో వేసింది సిట్. ఇక ఈ చార్జ్ షీట్ లో సిట్ పేర్కొన్న కీలక అంశాల విషయానికి వస్తే.. ఈ లిక్కర్ స్కాం కేసులో మొత్తం ముగ్గురు నిందితుల పాత్రపై కీలక ఆధారాలను సిట్ పొందుపరిచింది. రిటైర్డ్ ఐఎఎస్…
కవిత దీక్షకు కోర్టు నో.. ఇంటికి కవిత హైదరాబాద్ ధర్నాచౌక్లో కొనసాగుతున్న MLC కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష మంగళవారం డ్రామాటిక్ మలుపు తిరిగింది. కోర్టు అనుమతి నిరాకరించడంతో, పోలీసులు కవితను దీక్షా స్థలం నుంచి ఇంటికి తరలించే ఏర్పాట్లు ప్రారంభించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే, పోలీసులు మరోసారి కవితను దీక్ష విరమించాలని కోరారు. అయితే కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు దీక్ష కొనసాగించాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకుంటూ, వర్షం తగ్గిన…
విలాసవంతమైన జీవితాన్ని విడిచి.. సన్యాసిగా మారిన విదేశీ మహిళా డాక్టర్.. నేటి ప్రపంచంలో చాలా మంది డబ్బు, హోదా, విలాసాల కోసం పోటీ పడుతున్నారు. కానీ.. ఆత్మ శాంతి, జీవితానికి నిజమైన అర్థాన్ని వెతుక్కుంటూ భౌతిక సుఖాలను వదులుకునే వారు కొందరు ఉన్నారు. తాజాగా ఓ విదేశీ మహిళ విలాసవంతమైన జీవితం విడిచి సాధ్విగా మారింది. వృత్తిరీత్యా వైద్యురాలైన స్పానిష్ అమ్మాయి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. తమ దేశంలో అన్నీ వదిలి భారతదేశానికి వచ్చి సనాతన…
కలుషిత ఆహార నగరంగా విశాఖ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. విశాఖ కలుషిత ఆహార నగరంగా మారింది.. చిన్నపిల్లలు తినే తిండి దగ్గర నుంచి, మహిళలు, గర్భిణీలు తినే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వారం రోజుల నిల్వ ఉంచిన ఫుడ్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన మాంసపు పదార్థాలతో వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల జాయింట్ ఆపరేషన్లో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన…
నిత్య పెళ్లికూతురు.. 8 మందితో వివాహం, 9వ పెళ్లిలో పట్టుబడిన మహిళ.. ఆమెకు అప్పటికే 8 మంది పురుషులతో వివాహమైంది. పెళ్లి చేసుకోవడం ఎంచక్కా భర్తల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకుంది. చివరకు 9వ పెళ్లి చేసుకునే సమయంలో పోలీసులకు పట్టుబడింది ఈ కిలాడీ ‘‘నిత్య పెళ్లికూతురు’’. మహారాష్ట్ర నాగ్పూర్లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పురుషులను వివాహం చేసుకుని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో…
కోనేరు హంపి ఓటమి.. ప్రపంచ చెస్ ఛాంపియన్గా దివ్య దేశ్ముఖ్! 2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా నాగపుర్కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ నిలిచారు. సోమవారం జార్జియాలోని బటుమిలో జరిగిన టైబ్రేక్ రెండవ ర్యాపిడ్ గేమ్లో తెలుగు తేజం కోనేరు హంపీని ఓడించి (2.5-1.5) టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఫైనల్స్లో తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. మహిళల చెస్…
యూనస్ షేక్ హసీనాకు భయపడుతున్నారా..? మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ను విడిచిపెట్టి ఏడాది అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్, స్టూడెంట్స్ లీగ్లను బంగ్లాలో నిషేధించారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ మనస్సులో షేక్ హసీనా భయం తొలగిపోయినట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ యూనస్ మరోసారి షేక్ హసీనా పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు అవామీ లీగ్ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్.. 12,000…
రాజకీయ ఎంట్రీకి కారణాలు ఇవే.. పాడ్కాస్ట్లో జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ.. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన రాజకీయ ఎంట్రీకి ఎక్కడ బీజం పడిందో చెప్పారు. ఆయన తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. పాఠశాల నాటి పరిస్థితులు, రాజకీయంపై ఆసక్తి పెరగడానికి గల కారణాలు వివరించారు. తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని.. అక్కడి నుంచే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లమని తెలిపారు. “చిన్నతనంలో ఉన్నప్పుడే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లం. మేము…