సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర నేతలు భేటీ.. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్ల పథకాలపై చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను సీఎంను అడిగి నేతలు తెలుసుకున్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని మహారాష్ట్ర…
అవినాష్రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా నందరెడ్డి కేసులో.. సీబీఐ దూకుడు పెంచింది.. వరుసగా నిందితులను ప్రశ్నిస్తోంది.. మరోవైపు, కేసులో విచారణ సాగుతోంది.. అయితే, ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఎంపీ అవినాష్రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదన్నారు.. అవినాష్రెడ్డి ఫోన్ను ఆరోజే పోలీసులు చెక్ చేశారు. నాలుగు రోజుల నుంచి తెగ ప్రచారం చేస్తున్నారని.. కుట్ర…
వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు.. కానీ, వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా. బి. వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నలకు లోక్సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.. అయితే, 75.3 కిలోమీటర్ల పొడవుతో 15,993 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని…
శ్రీవారిపై కాసుల వర్షం.. జనవరిలోనూ ఆ మార్క్ దాటింది.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. ఇదే సమయంలో.. శ్రీవారికి కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తారు.. శ్రీవారి హుండీల్లో ప్రతీ రోజూ కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారం సమర్పిస్తూనే ఉంటారు భక్తులు.. అయితే, కరోనా సమయంలో.. శ్రీవారి దర్శనాలను రద్దు చేయడంతో.. ఆదాయం తగ్గిపోయింది.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత…
సీఎం జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది… గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ పర్యటన కోసం బయల్దేరారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఆయన బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలట్.. దీంతో అప్రమత్తమైన పైలట్.. తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసరం ల్యాండ్ చేశారు.. సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానం.. తిరిగి…
స్కూల్లో ఇక నో సార్.. నో మేడం.. ఓన్లీ టీచర్.. పాఠశాలల్లో పురుషు ఉపాధ్యాయులను సార్ అని.. మహిళా ఉపాధ్యాయులను మేడం అంటూ సంబోధిస్తుంటారు.. అయితే, పాఠశాలల్లో ఇక నో ‘సర్’.. నో ‘మేడమ్’.. ఓన్లీ ‘టీచర్’ అంటోంది కేరళ.. ఉపాధ్యాయులకు సర్ లేదా మేడమ్ వంటి గౌరవప్రదమైన పదాల కంటే లింగబేధం లేని తటస్థ పదం టీచర్ మంచిదని కేరళ చైల్డ్ రైట్స్ ప్యానెల్ నిర్దేశించింది. కేరళ స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్…
స్కూల్లో సంక్రాంతి సంబరాలు.. భోగి మంటల్లో అపశృతి సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది.. అంతకంటే ముందే.. సంక్రాంతి సెలవులు వస్తాయి.. దీంతో.. ముందుగానే స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థల్లో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది.. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ప్రైవేటు పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేశారు.. అయితే, ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.. బాధిత విద్యార్థులను…
పవన్ కల్యాణ్ అంటే నాకు అభిమానం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కల్యాణ్ మా వాడు.. అభిమానం ఉందన్న ఆయన.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మీద మాకు అభిమానం ఉండదా..? అని ఎదురు ప్రశ్నించారు.. అయితే, పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందన్నారు.. ఇక, సీఎం.. సీఎం.. అంటూ పవన్ కల్యాణ్ను చూసి నినాదాలు చేస్తున్నవారికి ఆయన అన్యాయం చేస్తున్నారని…
పాడి రైతులకు రూ.7.20 కోట్ల బోనస్ కర్నూలు మిల్క్ యూనియన్ (విజయ డైరీ) పాడి రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా కర్నూలు మిల్క్ యూనియన్ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు.. రూ. 7.20 కోట్ల రూపాయల బోనస్ చెక్ను సీఎంకి అందజేశారు కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్.వి. జగన్ మోహన్ రెడ్డి… పాడి రైతుల విషయంలో…
మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసిన TSPSC న్యూ ఇయర్ వేళ టీఎస్పీఎస్సీ మరో మూడు నోటిఫికేషన్ లు విడుదల చేసింది. పురపాలక శాఖలో 78 అకౌంట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. జనవరి 20 నుండి ఫిబ్రవరి 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే.. దీంతో పాటు.. కళాశాల విద్యాశాఖలో 544 పోస్ట్ లు(491 డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లు) భర్తీకి మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది TSPSC.…