ఏపీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల తేదీలు ఇవే.. ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటన అన్ని పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది.. టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగియగానే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి.. ఇవాళ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. మే 5వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన EAPCET నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 15 నుంచి…
ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే…
కర్నూలులో భూప్రకంపనలు.. ఇళ్లు, సీసీ రోడ్డుకు బీటలు.. ఆంధ్రప్రదేశ్లో భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూ కంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి.. టర్కీలో భూకంపం తర్వాత భారత్లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో భూప్రకంపనల కలకలం రేపుతున్నాయి.. తుగ్గలి మండలం రాతనలో భూప్రకంపనలు వచ్చాయంటున్నారు స్థానికులు.. ఒక్కసారిగా భూ ప్రకంపనలు…
నేడు ప్రీతి స్వగ్రామం గిర్నితండాలో అంత్యక్రియలు వరంగల్లో ఆత్మహత్యాయత్నం చేసిన కేఎంసీ పీ.జీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి చెందింది. మెడికల్ విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి ఆదివారం మృతి చెందినట్లు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యన్రాయణ విడుదల చేసిన బులెటిన్లో, “మల్లిపుల్ విభాగాల నిపుణులైన వైద్యుల బృందం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డాక్టర్ ప్రీతిని రక్షించలేకపోయారు. ఫిబ్రవరి 26, 2023…
ఏపీకి ప్రత్యేక హోదా.. కట్టుబడి ఉన్నామని ప్రకటన రాజకీయ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ.. రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.. ప్లీనరీ వేదికగా చేసిన రాజకీయ తీర్మానంలో ఏపీకి “ప్రత్యేక హోదా” అంశం ప్రస్తావించారు.. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి కట్టుబడి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.. ఇక, కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక తోడ్పాటు, సహాయం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని తీర్మానంలో…
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు లోకేష్… అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేష్ చెప్పుకొచ్చారు.. కాగా, నారా…
అప్పటి వరకు బండి సంజయే అధ్యక్షుడు.. స్పష్టం చేసిన తరుణ్ చుగ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై పార్టీ అధిష్టానం గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నట్టుందే.. సంజయ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. దానికి కారణం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.. ఎందుకంటే.. 2024 వరకు బండి సంజయ్నే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేశారు తరుణ్ చుగ్.. పార్టీ సంస్థాగత…
ఏపీకి చేరుకున్న కొత్త గవర్నర్.. స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి చేరుకున్నారు.. గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయనకు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నూతన గవర్నర్ కు ఎయిర్పోర్ట్లో సీఎం జగన్తో పాటు సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్, మంత్రి జోగి రమేష్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్…
నూతన పారిశ్రామిక విధానంపై భేటీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. నూతన పారిశ్రామిక విధానంపై ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సందర్భంగా పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.. పరిశ్రమల స్థాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని ఆదేశించిన ఆయన.. మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయంగా…
లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని…