తెలంగాణ ప్రభుత్వం చొరవ అభినందనీయం.. అప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-EOIకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.. అయితే, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు EOIకి వచ్చినప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అంటున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపించిన చొరవ అభినందనీయమన్న ఆయన… EOIలో భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాను అన్నారు.. అవసరం అయితే EOIను వాయిదా వేయాలని డిమాండ్…
రుషికొండ తవ్వకాలపై పవన్ సెటైర్లు.. రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.. సోషల్ మీడియా వేదికగా రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కీలక మలుపు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న సమయంలో.. కీలక మలుపు తిరిగినట్టు అయ్యింది.. విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఫగ్గన్.. విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు..…
పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయంపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం రామయంపేటలో KCR కాలనీ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను మంత్రి ప్రారంభించారు. టెన్త్ పేపర్ లీకేజీలపై బండి సంజయ్ అరెస్ట్ స్పందించిన మంత్రి హరీశ్ రావు సంజయ్ పై…
సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే.. నిన్న జరిగిన సీఎం సమీక్షకు గైర్హజరుపై స్పందించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కోర్సు చేస్తున్న.. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరుకాలేదన్నారు. ఇక, నేను, కొడాలి నాని పార్టీ మారుతున్నాం అంటూ ప్రచారాలు వచ్చాయి.. అవి మెరుపు కలలు మాత్రమే.. అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ.. ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష…
రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు..! మార్చురీలో లేచాడు..! చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడం ఏంటి? మార్చురీ అంటేనే శవాలను భద్రపరచడానికే.. పోస్టుమార్టం నిర్వహించడానికో తరలిస్తారు.. అక్కడ చనిపోయిన వ్యక్తి లేవడం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా తిర్మన్పల్లికి చెందిన అబ్దుల్ గఫర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. అయితే, నిజామాబాద్ నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతిచెందినట్టు చెప్పారు.. దీంతో, మార్గమద్యలోనే మృతిచెందాడని భావించి.. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి…
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు.. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పులిపాటి ప్రవీణ్కుమార్ వెల్లడించారు.. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేత సత్యకుమార్…
చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ పుట్టాడు.. ఆయన్ని దేవుడే రక్షించాలి..! కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముని ఆలయంలో ఇవాళ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అంబటి రాంబాబు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట ప్రత్యేకతను సంతరించుకుందన్న ఆయన.. శ్రీరామ నవమి రోజున కుటుంబ సమేతంగా కోదండ రాముణ్ణి దర్శించు కోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. భద్రాద్రి కన్నా ఎంతో విశిష్టమైన ఆలయం ఒంటిమిట్టగా అభివర్ణించారు.. ఇక, చంద్రబాబు, పవన్పై విరుచుకుపడ్డారు…
ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్ ప్రయాణికులు..! మరోసారి ఎయిరిండియా నిర్వాకం విదేశీ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది.. నేటి నుండి గన్నవరం-కువైట్ విమాన సర్వీసు ప్రారంభం అయిన విషయం విదితమే.. విజయవాడ నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది.. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్కు విమానం బయల్దేరనుంది ఈ విమానం.. షెడ్యూల్ ప్రకారం ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్ చేరుకుంటుంది.. ఇక,…
ప్రాణాలు తీస్తోన్న డీజేలు.. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు మృతి చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పెళ్లి పెళ్లి వేడుకల్లో డీజే సాంగ్ కి హుషారుగా స్టెప్పులు వేశాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్య సాయి.. శ్రీపెరంబదూర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. అయితే, ఫ్రెండ్ మ్యారేజ్ కావడంతో.. తన స్నేహితులతో కలిసి వెళ్లాడు.. ఇక, పెళ్లి వేడుకల్లో హుషారుగా గడిపాడు..…